పుట:మ ధు క ల శ మ్.pdf/10

ఈ పుట ఆమోదించబడ్డది

7

వాడు కలడో లేడో” అన్న భయంకరమైన ప్రశ్నను గజేంద్రుడితో పాటు, సంశయగ్రస్తులైన సర్వమానవులతో పాటు, ఉమరుకూడా వేశాడు. ఆంధప్రాయమైన మూఢనమ్మకంతో తృప్తిచెందక, దీని అంతు కనుక్కోవలెనని జీవితమంతా పాటుపడ్డాడు. పండితులతో, వేదాంతులతో తర్కించాడు. అతని సందేహం తీరలేదు. వెళ్లినదారినే తిరిగి వచ్చినట్లయింది, అతనికృషి. ఉమరు భాషావేత్త, జ్యోతిశ్శాస్త్రంలో నిధి; వేదాంతులతో చెలిమిచేసినాడు; ముందు వెనుక లాలోచించకుండా అవివేరులవలె నాస్తికవాదంలోకి దిగలేదు. కాని, అప్రత్యక్షమై, అనుభవదూరమైన విషయాన్ని గూర్చి అంతులేని తర్కంలోకి దిగడం వృధాప్రయాస అనుకున్నాడు. “ధర్మమూర్తీ, దయాస్వరూపుడూ, అయిన మహావ్యక్తి ఈ సృష్టినంతా శాసిస్తున్నట్లయితే, ఆతడే సర్వాన్నీ చక్క పెట్టుతాడు; అన్యాయంగా, నిరంకుశంగా మనలను నరకకూపంలోకి త్రోయడు. అంతా శుభంగానే పరిణమిస్తుంది. ఇంతకన్న మనస్సును చీకాకు పెట్టుకోవడమెందుకు ?" ఇదే ఉమరు దృష్టి.

జీవితంలో కష్టమూ ఉన్నది; సుఖమూ ఉన్నది. సృష్టిలో అందవికారమూ ఉన్నది; అందమూ ఉన్నది. కండ్ల ఎదుట ఉన్న అందాన్ని చూచి సంతోషించడమూ, మనసుకు న్యాయంగా అందు