ద్వి తీ యా శ్వా స ము
75
పాలావారాశిలోపలి తెల్ల దీవిలో
సతతమామోదించు పతగమొక్కొ
లేక భూలోకమునకల్ల లేఖశాఖి
విడిచి వచ్చి మదారామవిటవిసీమఁ
గానఁబడినట్టి యమరశుకంబొ కాక
మనుజఖగమాత్రమున కిట్టి మహిమ గలదె!12
ఉ. మారుని ఘోటకంబగుట మాటికిఁ గూర్చి ఖలీనవైఖరిం
బేరు శుకోన్నతిం దగుట బెంపుగఁ గాంచి సదాగమాంత స
త్కారము పక్షమల్ల హరితత్త్వము నందుట రామసంస్మృతిం
దారిచి కీర మీ సుముఖతాస్థితి మాకనురక్తిఁదెల్పెడిన్.13
గీ. అనుచుఁ బ్రీతి వొడమ నా విహంగమమున్న
చిన్ని మావిగుములు సేర నరిగి
వెసఁ దదీయవదన విగళిత ఫలరసం
బాని సొక్కి యిట్టు లనియెఁ జక్రి.14
కం. ఈ చిలుక ఫలముఖంబున
సూచింపఁబోలు మనకు శోభనఫలలా
భాచరణమునని కరశా
ఖాచతురిమఁ బూని దానిఁ గైకొనువాఁడై.15
సీ. ఘనదివ్యమంగళాంగము గానఁబడకుండఁ
బొదల మాటు నొకింత యొదిగి యొదిగి
చరణాంబుజయుగంబు చప్పుడు గాకుండ
బొంచి పొంచి యొకింత పోయి పోయి