పుట:ముకుందవిలాసము.pdf/122

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

75


    పాలావారాశిలోపలి తెల్ల దీవిలో
             సతతమామోదించు పతగమొక్కొ
    లేక భూలోకమునకల్ల లేఖశాఖి
    విడిచి వచ్చి మదారామవిటవిసీమఁ
    గానఁబడినట్టి యమరశుకంబొ కాక
    మనుజఖగమాత్రమున కిట్టి మహిమ గలదె!12

ఉ. మారుని ఘోటకంబగుట మాటికిఁ గూర్చి ఖలీనవైఖరిం
    బేరు శుకోన్నతిం దగుట బెంపుగఁ గాంచి సదాగమాంత స
    త్కారము పక్షమల్ల హరితత్త్వము నందుట రామసంస్మృతిం
    దారిచి కీర మీ సుముఖతాస్థితి మాకనురక్తిఁదెల్పెడిన్.13

గీ. అనుచుఁ బ్రీతి వొడమ నా విహంగమమున్న
    చిన్ని మావిగుములు సేర నరిగి
    వెసఁ దదీయవదన విగళిత ఫలరసం
    బాని సొక్కి యిట్టు లనియెఁ జక్రి.14

కం. ఈ చిలుక ఫలముఖంబున
    సూచింపఁబోలు మనకు శోభనఫలలా
    భాచరణమునని కరశా
    ఖాచతురిమఁ బూని దానిఁ గైకొనువాఁడై.15

సీ. ఘనదివ్యమంగళాంగము గానఁబడకుండఁ
             బొదల మాటు నొకింత యొదిగి యొదిగి
    చరణాంబుజయుగంబు చప్పుడు గాకుండ
             బొంచి పొంచి యొకింత పోయి పోయి