పుట:మీగడతరకలు.pdf/51

ఈ పుట ఆమోదించబడ్డది



తార లను ముత్తియంబుల నేరి తీయ
సమయనావికుఁ డాకాశజలధియందు
వెడలి చనుచున్న చక్కని పడవ యనఁగ
విదియచందురుఁ డందమై వెలయుచుండె.

నలువ మరునకు నభ మను పలకమీఁద
సుద్ద చేఁ బట్టి వ్రాసిన సున్న లనఁగ
తారకారాజి యొప్ప, 'అ' కార మనఁగ
అర్ధ చంద్రుఁడు మిసిమిమై నలరుచుండె.

నీలిగోళంబు రేకపైఁ దేలియాడ
కొదమజాబిల్లి రాజిల్లె చదలయందు,
పాలకడలిని తరిగొండ లీలఁ దాల్చు
ఆదికచ్ఛపమూర్తితో నవఘళించి.

43