ఈ పుట ఆమోదించబడ్డది
ఈశ్వరుడు - శనైశ్చరుఁడు
సిరులు చెలరంగ కై లాసశిఖరిమీఁద
ప్రమథగణములు సేవింప ప్రమద మలర
పార్వతీసహితుం డయి పరమశివుఁడు
నిండుకొలువును దీర్చి కూర్చుండియుండె.
అంత నచటికి శని వచ్చి, " పంత మొప్ప
నేను తలఁచితి." , యెట్టి వాని - నైన
కొందలము గూర్చి దైన్యంబు నొందఁ జేసి
పట్టి పీడింతుఁ గా " కని ప్రతిన వట్టె.
అతని ప్రజ్ఞ బరీక్షింప ననియె శివుఁడు:
" ఓయి నను గూడ దైన్యంబు నొందఁ జేయఁ
గలవె ? అటులైన మాసంబు గడువు నిత్తు,
ఏదిచూచెద చూపుమా నీదుమహిమ "
36