|
రించుచుండె నంతఁ గొంతకాలంబునకుఁ గృతవీర్యుం డనుమహీపతి పరలోకగతుం
డైన నతనితనయుం డర్జునుండు నిజాభిషేకార్థం బరుగుదెంచిన మంత్రిపురోహిత
పౌరజనంబులం జూచి నరకోత్తరం బైనయీరాజ్యంబు నేఁ జేయ నొల్ల వినుండు.
| 212
|
కార్తవీర్యార్జునవృత్తాంతము
సీ. |
పరనృపతస్కరబాధలు లే కుండఁ దమ్ముఁ గాచుటకునై ధరణిపతికి
ద్వాదశాంశధనంబు వాణిజ్యపరులు గోపాలకర్షకులు షడ్భాగగవ్య
ధాన్యంబు లిత్తురు తప్పక యజ్ఞనావలుల రక్షింపఁగ వలను లేక
యవనితలేశ్వరుం డప్పాళు లూరక హరియించి దస్యునియట్ల ఘోర
|
|
తే. |
నరకమునఁ బడు భూవహనమున కిప్పు, డే నశక్తుండఁ గావున నే వనమున
కరిగి తప మాచరించి యధ్యాత్మయోగ, సిద్ధిఁ బొందెద నని యర్థిఁ జెప్పుటయును.
| 213
|
గర్గకార్తవీర్యసంవాదము
తే. |
అతనిమనమునందలినిశ్చయం బెఱింగి, గర్గుఁ డనుమంత్రి యి ట్లనుఁ గరము నెమ్మిఁ
దపము సేయంగ నీ విట్లు విపినమునకుఁ, జనియె దేనియుఁ జెప్పెద మనుజనాథ!
| 214
|
క. |
హరి దత్తాత్రేయుం డన, ధరణి నవతరించి యోగతత్పరుఁడును ని
ర్జరమునిసేవితుఁడును నై, పరగుచు నున్నాఁ డతని నుపాసింపు నృపా!
| 215
|
క. |
అనిమిషపతి యసురులచేఁ, దనరాజ్యముఁ గోలుపోయి తా నయ్యోగీం
ద్రుని నారాధించి మగుడ, దనుజుల నిర్జించి నిజపదస్థితి నొందెన్.
| 216
|
వ. |
అనిన నర్జునుం డి ట్లనియె.
| 217
|
ఆ. |
అసురవరులచేత నమరేశ్వరుం డెట్లు, గోలుపోయెఁ దనవిశాలలక్ష్మి
నమ్మునీంద్రు నెట్టు లారాధనము సేసె, మగుడ నెట్లు రాజ్యమహిమ వడసె.
| 218
|
వ. |
అని యడిగినం గార్తవీర్యార్జునునకు గర్గుం డి ట్లనియె.
| 219
|
శా. |
జంభాదిప్రకటాసురప్రకరము ల్శక్రాదిదేవాలియు
న్శుంభద్విక్రమకేళిలీల లెసఁగ న్సోమించి యేకాబ్ద ము
జ్జృంభోత్సాహము లుల్లసిల్లఁగ జయశ్రీలోలత న్బోర సం
రంభం బేది నిలింపు లోడి రసురవ్రాతాస్త్రభిన్నాంగు లై.
| 220
|
తే. |
అమరు లట్లోడి వాలఖిల్యాదిమునులుఁ, దారు గురునిపాలికిఁ జని దైత్యవరుల
నోర్చుతెఱఁగు విచారించుచుండ వారి, కెలమి మిగుల బృహస్పతి యిట్టు లనియె.
| 221
|
మాలిని. |
అతివికృతచరిత్రుం డత్రిపుత్త్రుండు యోగ
స్థితినిరతుఁడు దత్తాత్రేయుఁ డవ్విష్ణుమూర్తి
న్సతతము నతిభక్తి న్వత్సలుంగా భజింపుం
డతఁ డసురకులఘ్నోద్యద్వరం బిచ్చు మీకున్.
| 222
|