పుట:మార్కండేయపురాణము (మారన).pdf/282

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

పాతాళం బఖిలంబునుం బరగి సర్పశ్రేణుల న్సర్వలో
కాతంకంబుగఁ గాల్పఁ జొచ్పుటయు హాహారావము ల్సేయుచు
న్భీతిం దల్లులఁ దండ్రుల న్దనయుల న్వే చీరుచు న్బన్నగ
వ్రాతము ల్హనార్చుల న్బడగలు న్వాలంబులు న్రాలఁగన్.

241


క.

కర మార్తిఁ బొంది వస్త్రా, భరణంబులు దిగ్గ విడిచి పాతాళముఁ జె
చ్చెర వెడలి మరుత్తజనని, శరణము వేఁడుచు రయమునఁ జనిరి మునీంద్రా!

242


మ.

చని యాభామినిఁ గాంచి యార్తి యడర న్సర్పంబు లందంద వం
దనము ల్సేసి సగద్గదస్వనముల న్దల్లీ! దయ నాకు ని
చ్చినయానాఁటివరంబు నేఁడు మదిలోఁ జింతింపు యుష్మత్సుతా
స్త్రనితాంతాగ్ని నశింపకుండఁగ వెస న్రక్షింపు మమ్మందఱన్.

243


క.

ఘోరాస్త్రానలమున విపు, లోరగలోకంబు గాల్పకుండఁగఁ దల్లీ!
వారింపుము నీపుత్రకు, నేరూపున నైనఁ గావు మీయహికులమున్.

244


క.

స్ఫురితామర్షోద్దీపిత, మరుత్తఘోరాస్త్రవహ్ని మాఁడెడుమాకు
న్గరుణింపు నీవు దక్కఁగ, శరణం బగువారు లేరు సాధుచరిత్రా!

245


వ.

అనినయురగంబులవచనంబులు విని వారికిం దొల్లి తనయిచ్చినవరంబునుం దలంచి
సంభ్రమంబునం బతి నాలోకించి పాతాళంబునకు నన్నుం దోడ్కొని పోయి
ప్రార్థించిన వీరికి నభయం బిచ్చినదాన నాపలు కసత్యంబు గాకుండ నీకొడుకు
వారింపు మనిన నవేక్షితుం డత్యపరాధం బొనర్చిన యాదర్వీకరంబులందు భవ
న్నందను కోపంబు దుర్వారం బై యున్నయది యెట్లు మాన్పింపవచ్చునని తలం
చెద ననిన దందశూకంబులు తల్లడిల్లి మహాత్మా! యట్లనకుము శరణాగతులము
మాకుం బ్రసన్నుండ నగుము క్షత్త్రియులశస్త్రధారణం బార్తప్రాణకారణంబు
గాదె యని ప్రార్థించిన నతండు.

246


క.

శరణాగతార్తదర్వీ, కరదీనోక్తుల మనంబు గడుఁగరుణాసం
భరిత మయిన ని ట్లనియెను, ధరణీనాయకుఁడు ప్రీతిఁ దనసతితోడన్.

247


క.

తరుణీ! యే నీపంపున, మరుత్తు వారింతుఁ గాతు మానుగ సర్పో
త్కరము నవశ్యమును విను, శరణాగతులం ద్యజింపఁ జన దెవ్వరికిన్.

248

భామినివాక్యమున నవేక్షితుఁడు పాముల రక్షింపఁ బ్రతిజ్ఞ చేయుట

క.

విను నావచనంబున నీ, తనయుం డత్యుగ్ర మైనతనయస్త్రము చ
య్యన సంహరింపకున్నను, ఘనదివ్యాస్త్రహతి దానిఁ గ్రాతుం దరుణీ!

249


మ.

అని రాజన్యవరుం డవేక్షితుఁడు పూజ్యం బైనచాపంబు న
స్త్రనికాయంబును దాల్చి తాను సతియు న్రాజిల్లునౌర్వాశ్రమ