పుట:మధుర గీతికలు.pdf/752

ఈ పుట ఆమోదించబడ్డది

విద్యోతమానము లగుచున్నవి. జీససు సిద్ధాంతముల నారూఢి పఱచుటకే నేఁడీ సత్యాగ్రహ మను మహాప్రయోగము సాగుచున్నది.

జీససు ప్రబోధించిన పరమార్థముల నిరూపించుట కుద యించిన ఈ యమోఘసాధనమును క్రైస్తవ ప్రపంచమున నెల్ల బలవత్తమ మైన సామ్రాజ్యము తన సర్వశక్తులతో బ్రతిఘటించుచు తన్ను తానే ఖండించుకొనుచున్నది.

ఈ 'క్రైస్తవ' సామ్రాజ్యము భారత దేశ సంపదను కబళించి మదించియున్నది. భారతీయులు నేఁడు అస్తులు పస్తులు జేయుచు ఆస్థిగతపంజరములై 'అన్నమో రామచంద్రా' యని యల్లాడుచు పిడికెడు మెతుకులకై క్రైస్తవుల యాచించి అంగ లార్చిరి. కాని కబళమునకు బదులు కాఱుఱాయి బడసిరి. అంతియ కాదు - చెంపపై లెంపకాయలు గూడ దినిరి, భార తీయులు మహాత్ముని యుపదేశములకు బద్ధులై క్రైస్తవులకు రెండవచెంప జూపిరి, వారు ఆ చెంపపైఁ గూడ గపీటములు చఱచిరి. కాని భారతీయులు. శాంతమును గోల్పడలేదు, ఈ శాంతిమార్గముననే దౌష్ట్యము నడఁగఁద్రొక్కఁ గల మని గాంధీమహాత్ముఁ డొసఁగిన యుపదేశము వారి రక్త నాళము లలో ప్రత్యణువునను ప్రవహించుచున్నది.

31