పుట:మధుర గీతికలు.pdf/554

ఈ పుట ఆమోదించబడ్డది

పద్య సుమాంజలి


ధీరుడు, కవిమాన్యుడు, కృ
ష్ణారాయ కవీంద్రు కవిత నవనీత మ్మై.
ధారాళ మగుచు జనులౌ
రౌరా యని సంతసింప నవని జెలంగున్.

మల్లె పూలప్రోవు మంచిగంధపు తావి
ఇతని కై తగాంచ స్మృతికి దగులు
పలుకులకును సౌరభమ్మును జేకూర్చి
సేసె తెలుగు బాస సేవనితడు.

పంచదార కన్న పాలమీగడ కన్న
తేనె కన్న ద్రాక్ష తీపి కన్న
పాప లేత వైన పలుకుల కన్నను
కరముతీపి తాతగారి కవిత.