పుట:మధుర గీతికలు.pdf/498

ఈ పుట ఆమోదించబడ్డది




ఒత్తికొనివచ్చు నుదధియుద్వృత్తి చూచి
గద్దియలు డిగ్గి, గుండియల్ దద్దరిల్ల
దవ్వుదవ్వుగ వెనుకకు తలఁగి చనిరి
పరిజనంబులు, మంత్రులు. ప్రభువరుండు.

కనుల నిప్పులు రాలంగ. ననియె ఱేఁడు:
'ఎవనిముదలను తలఁదాల్చి భువియు దివియు
నబ్ది మెలఁగుచునుండు, నయ్యాదిశక్తి
వొక్కనినె కాని, మనుజుల మొక్కవలదు.'

నాఁడు మొదలుగ ధారుణీనాయకుండు
భాగ్యభోగ్యము లెల్లను పరిహరించి,
మణిమయంబగు మకుటంబు మౌళిఁదాల్పఁ
దలఁప డయ్యెను జీవితాంతబుదనుక.

47