పుట:మధుర గీతికలు.pdf/171

ఈ పుట ఆమోదించబడ్డది

ఈశ్వఁరుడు - శనైశ్చరుఁడు


సిరులు చెలగంగ కైలాసశిఖరిమీఁద
ప్రమథగణములు సేవింప ప్రమద మరల:
పార్వతీసహితుం డయి పరమశివుఁడు
నిండుకొలువును దీర్చి కూర్చుండియుండె.

అంత నచటికి శని వచ్చి, “పంత మొప్ప
నేను తలంచితినా, యెట్టివాని నైన
కొందలము గూర్చి దైన్యంబు నొందఁ జేసి
పట్టి పీడింతుఁగా” కని ప్రతిన వట్టె.

అతనిప్రజ్ఞఁ బరీక్షింప ననియె శివుఁడు:
"ఓయి నను గూడ దైన్యంబు నొందఁ జేయఁ
గలవె? అట్లు లైన మాసంబు గడువు నిత్తు,
ఏది చూచెద చూపుమా నీదుమహిమ.”

36