104
శ్రీ భీమశ్వరపురాణము
వ. | అనంతరం బాశివుం డభ్యంతరమందిరంబునఁ బ్రవేశించి హరివిరించిప్రముఖబృందారకులచేత మధుపర్కాద్యుపచారంబులు గైకొని కక్ష్యాంతరంబులు గడచి గర్భగృహమండపంబునందు నూత్నరత్నస్వరూపంబైన శ్రీభీమనాథ మహాదేవ స్వయంభూజ్యోతిస్సుధామయమహాలింగంబు నాగమోక్తప్రకారంబుల నర్చించి యాపాదమస్తకంబు తద్రూపంబు ముహూర్తమాత్రంబు చింతించి. | 48 |
శ్రీకంఠుఁడు దక్షారామభీమేశుతో నైక్యతం బొరయుట
శా. | కైలాసాచలకేలిమందిరుఁడు శ్రీకంఠుంండు సోత్కంఠుఁడై | 49 |
సీ. | అవ్యయం బనవద్య మాద్య మచ్యుత మజం,బవ్యక్త మప్రమేయం బనంగఁ | |
తే. | భువనబీజంబు కైవల్యభోగదాయి, యఖిలకళ్యాణకారి విశ్వాద్భుతంబు | 50 |
వ. | బ్రాహ్మీప్రధానసప్తమాతృకలను నందీమహాకాళాదిప్రమథగణంబులును హరివిరించిప్రముఖబృందారకులును బురందరాదిలోకపాలకులును వసురుద్రాదిత్యమరుద్విశ్వేదేవాశ్వినీదేవతలును సిద్ధసాధ్యులును విద్యాధరోరగులును గ్రహనక్షత్రతారకంబులును బితృగణంబులును మూర్తంబులును నమూర్తంబులు నగుచరాచరంబులన్నియు నానారత్నగంధపుష్పధూపదీపనైవేద్యాదులు సమర్పించి ప్రదక్షిణంబు లాచరించి నమస్కరించి నుతియించిరి. తదనంతరంబ వెండియు. | 51 |
లక్ష్మ్యాదులు శ్రీభీమేశుని స్తుతించుట
క. | సిరివాణిగౌరిసతియ, ప్సరసలరుంధతియహల్యశచిమొదలగు స | 52 |
వ. | ఇట్లు పూజ చేసి పరమపతివ్రతలు ముకుళితకరాంబుజలై శ్రీదక్షవాటీపురాధ్యక్ష భీమేశ్వర భీమనాథ భీమశంకర భీమలింగ మహాదివ్యలింగ యవాఙ్మానసగోచర సనకసనందనసనత్కుమారసనత్సుజాతాదియోగీంద్రులు నపారంబైన నీమహిమఁ గొనియాడనేర, రటుగావున మిమ్ము స్తోత్రంబు సేయ మాబోంట్లతరంబె? నిర్గుణుండవు సగుణుండవు గుణాతీతుండవు గుణాఢ్యుండవు నీ వొక్కగుణంబున | |