పుట:భాస్కరరామాయణము.pdf/426

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యాలోలధ్వజచిత్రతోరణమహాయంత్రాదు లి ట్లొప్పునే.

453


ఉ.

నేఁటికి నొప్పుఁ గాక రజనీచరువీ డెటు లైన నెల్లి పో
దాఁటి కవాటముల్ విఱుగఁ దాఁచుచుఁ జేతులతీఁట వోవ మై
తీఁటలు పుచ్చి రక్కసులఁ దీర్చుట రాముఁ డొనర్పనున్న పె
న్వీఁటకు రావణాదిమృగబృందము దార్చు టటంచు నార్చినన్.

454


క.

వనజభవాండము సంధులు, కనుకని బి ట్టవిసె నపుడు ఖరకరుఁడు నభం
బున నుండ నోడి క్రిందికిఁ, జనుచుండెడుభంగి నపరజలనిధిఁ గ్రుంకెన్.

455


చ.

అవిరళతారకానిబిడహారము లోలి ధరించి చంద్రికా
ధవళవినూతనాంబరము దట్టము గాఁగ ముసుంగు పెట్టి కై
రవమధురస్మితం బమర రాత్రివిలాసిని యొప్పె శీతరు
క్ప్రవిమలరత్నదీపమును గల్గునజాండనికేతనంబునన్.

456


క.

ప్రకటసుధాంశుగ్రహతా, రక మై యొకమిన్ను మింట రాయుచు నున్న
ట్లొకలంకయుఁ బాతాళము, నకుఁ గల్గినమాడ్కి నబ్ధి నడుమం దోఁచెన్.

457


వ.

అంత నంశుమంతుం డుదయాచలంబు నలంకరించుటయు ననుచరు లయినవన
చరులు దమతమయూథంబులం దలకడచి లంకాపురంబునుపవనంబులకుం గవిసి.

458


క.

మిడుతగమి గవియుతఱుచునఁ, బొడనీడలు నెండతునియప్రోవులుఁ గలయం
బుడమిం దిలతండులగతిఁ, బడఁగా నుడువీథినుండి పఱచిరి పెలుచన్.

459


తే.

ఇనకులీనుఁడు వర్ణసమేతుఁ డగుచు, యోజనద్వయవృత్తమై యొప్పునగ్ర
శిఖర మెక్కి వెలిఁగె లంకచేటుతఱికిఁ, గానఁబడునాగ్రహప్రతిభానుఁ డనఁగ.

460


వ.

ఆసమయంబున.

461


చ.

కపులు ఫలోపజీవితులు గావున వారికి నాశ్రయంబు లం
ఘ్రిపముల యంచు రావణుఁ డొగిం బెనుఁజిచ్చులు వైవఁ బంచె నా
నుపవనపాదపావళుల నుత్థితషట్పదరాజితోడ ద
ట్టపుఁజిగురాకు లెల్లెడ నెతడం గనుపట్టెఁ బురంబుచుట్టునున్.

462


క.

వనచరసేనాలోకన, మున కచ్చర లట విమానముల వచ్చిరి నా
ఘనచుంబిసౌధవలభులఁ, గనకరజతసాలభంజికలు పొరిఁ దోఁచెన్.

463


ఆ.

మర్కటధ్వనులకు మాఱు సెలంగుచు, నున్నకొండగుహల నుండ నోడి
పొడవు లెక్కె ననఁగ గుడులపైఁ బసిఁడిసిం, గంపుఁగొదమ లొగిన కానఁబడియె.

464


మ.

పరదారవ్యసనంబునం దలఁపు నాపైఁ బెట్టఁ డీపంక్తికం
ధరుఁ డిం కేటికి నాకు నీతఁడు భయార్తత్రాణకేళీధురం
ధర భూవల్లభ యవ్విభీషణ ననాథం జేయ ర మ్మంచుఁ ద
త్పురి చేసన్నలు సేసిన ట్లమరె నుద్ధూతధ్వజశ్రేణికల్.

465


వ.

అప్పు డప్పురంబునం గలవిశేషంబులు సవిశేషంబుగా నెఱుంగం దలంచి విభీష