పుట:భాస్కరరామాయణము.pdf/376

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మెయిగాలిఁ గడలెత్తి మిన్నేఱు గలఁగంగ, నురుమేఘమాలిక లోలిఁ దూల
ఘనఘోషణం బన ఘనసింహనాదంబు, బ్రహ్మాండభాండంబుఁ బగులఁజేయ
బెదరి సింహతతులు బిలముల ఘోషింప, వితతశిఖరవితతి విఱిగి పడఁగ
సానుకందరములసంధులు వ్రీలంగఁ, బవనసరణి కెగసెఁ బవనజుండు.

518


సీ.

అప్పుడు గంధర్వయక్షకిన్నరనాగ, విద్యాధరస్త్రీలు వెగడు నొంది
యంబరంబులు వీడ నాకల్పములు రాల, విభులతో నిలయముల్ విడిచి చనఁగ
శిరములు చదియంగ జిహ్వలు వెడలించి, విపులసర్పంబులు విషము లుమియ
జలధాతుచయములు సెలయేఱులై పాఱఁ, బెలుచ నాడెడుభంగిఁ జలన మొంది
యొగి శిల ల్రాల ముప్పదియోజనముల, పొడవుఁ బదియోజనమ్ముల నడిమివలముఁ
గలుగునగ్గిరి తరుమృగావళులతోడ, ధరణితలసమానంబుగా ధరణిఁ గ్రుంగె.

519


వ.

ఇ ట్లద్భుతమహాకారుం డగుచుఁ బక్షంబులతోడిశైలంబునుంబోలె నాకాశ
మార్గంబున నభ్రభీషణఘోషంబుగా నార్చుచు మనోజవంబునం బఱతెంచు
సమయంబున.

520


చ.

అనిలజుసింహనాదరవ మచ్చుగ నంగదముఖ్యవానరుల్
విని పరమప్రియంబునను వృక్షము లెక్కియుఁ గొండ లెక్కియుం
గనుఁగొనఁ జాపముక్తపటుకాండసమత్వరఁ బాఱుతేరఁగా
ఘనుఁ డగుజాంబవంతుఁడు దగం గపివీరులతోడ ని ట్లనున్.

521


క.

జనకజఁ బొడగన నోపును, హనుమంతుఁడు గానకున్న నతిగంభీర
ధ్వని యేల గల్గు మోదం, బున వచ్చుచునున్నవాఁడు భూరిధ్వనితోన్.

522


క.

అనునెడఁ [1]దన కూఱటగా, ఘనమైనాకంబు నిల్వఁ గని యగ్గిరి న
ల్లన కేల నంటుచున్ వడి, హనుమంతుం డబ్ధి దాఁటి యచ్చెరువారన్.

523


ఉ.

అంగదముఖ్యవానరులు హర్షసముద్గతరోమహర్షు లై
యంగము లెల్లఁ బొంగ హృదయం బలరంగఁ జెలంగి చూడఁగా
నింగిఁ బతంగుభంగిఁ బ్రభ నిండి వెలుంగ మహేంద్రభూమిభృ
చ్ఛృంగము గ్రుంగఁ బె ట్టుఱికెఁ జేవ మహాశనిభీకరంబుగన్.

524


వ.

ఇ ట్లుఱికి యమ్మహేంద్రాద్రిపై నిలిచి తనరాకకు సంతోషించునంగదజాంబవం
తులకు నమస్కరించి మధుమధురఫలాదివివిధోపాయనంబులు గొనుచుఁ బరి
వేష్టించి యాలింగనంబుల నభివందనంబుల నతిప్రశంసల నందఱు వనచరులు
నయ్యైవిధంబులం బూజింపఁ బూజితుం డయి కంటి నగ్గుణాభిరాముం డగు
రాముదేవిం బుణ్యసమేత సీత ననవుడు నాపలు కమృతోపమానం బగుచు వీను
ల కింపార మేనులు పొంగ వాలంబు లెత్తికొని గంతులు వైచుచు నార్చుచు
బహుప్రకారంబుల వానరులు చెలంగ నప్పు డంగదుం గౌఁగిలించుకొని హను

  1. బొడవుగ ముందట