పుట:భాస్కరరామాయణము.pdf/279

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అని పావని పల్కిన న, ల్లన నతముఖుఁ డై బలాబలంబులు చిత్తం
బునఁ బోలఁ జూచి మంత్రుల, కినతనయుఁడు కొంతవడికి ని ట్లని పలికెన్.

451


క.

రామున కే నపరాధం, బేమియుఁ జేయను దురుక్తు లేమియు నాడన్
సౌమిత్రి యూర కేలొకొ, నామీఁదం గోపమెత్తినాఁ డుగ్రముగన్.

452


తే.

మిత్రభేదంబు సేయ నమిత్రుఁ డెవ్వఁ
డట్లు సౌమిత్రికిని గోప మడర నన్ను
నహితుఁగాఁ జెప్పినాఁడొ నాయందు దోష
మొండు గావించి యాతఁడు మండువాఁడొ.

453


క.

అతిమిత్రుఁ డగుసుమిత్రా, సుతుఁ డధికక్రోధ మాత్మఁ జోఁకి యునికి నా
కతిశాతహృదయశల్యము, గతి నున్నది మానసమునఁ గడుదుస్సహ మై.

454


క.

మనుజేశుఁడు నాకుం జే, సినయుపకారంబు మఱవఁ జిత్తం బలరన్
మును చెలిమి చేసి విభుతోఁ, దనరం బలికిన ప్రతిజ్ఞ తప్ప కొనర్తున్.

455


వ.

అనిన విని హనుమంతుండు సుగ్రీవునిం గనుంగొని.

456


క.

నీవలన నెగ్గు గానము, నీవు కృతజ్ఞుఁడవు ప్రతిన నెఱపెదు మీఁదన్
భూవిభుతమ్ముం డిటకున్, వే వచ్చిన కారణంబు వినుము కపీంద్రా.

457


క.

జానకి వెదకం బుచ్చెద, వానలు [1]వెలియంగ ననుచు వసుధేశునితోఁ
బూనికఁ బలికితి విప్పుడు, వానలు వెలిసెను శరర్తు వాలఁగఁ జొచ్చెన్.

458


క.

కాలం బెఱుఁగక రతిసుఖ, లోలత నీ వునికి నాత్మలోనన్ వగలం
దూలుచు లక్ష్మణు రామనృ, పాలుఁడు పుత్తెంచెఁ బ్రణయభరరోషమునన్.

459


ఆ.

వాలిఁ జంపి నీకు వనచరరాజ్యంబు, రామచంద్రుఁ డిచ్చెఁ ప్రేమ మెసఁగఁ
గాన కృత మెఱింగి మానవేంద్రునికోర్కి, చెలిమిఁ దడయకుండ జేయవలయు.

460


వ.

అని హనుమంతుండు పలుకుహితోక్తులకు సుగ్రీవుం డెంతయు సంతోషించె
నంత సుగ్రీవమంత్రిసమానీతుం డై లక్ష్మణుండు జాతరూపమయంబును గనక
సాలభంజికాచిత్రితవైడూర్యస్తంభసంభృతంబును దివ్యరత్నసమాకీర్ణప్రవాళో
ద్ధూతతోరణంబును బహులఫలదళకుసుమవిసరభాసురోద్యానభాసమానంబును
భర్మనిర్మితహర్మ్యప్రాసాదరమ్యంబును దేవగంధర్వసంభూతవానరసంఘాతసమ
న్వితంబును జందనాగరుకమలకువలయప్రముఖకుసుమమైరేయాదవరాసవవా
సితరాజమార్గంబును విమలాప్సరోవరమనోహరంబును దేవతాయతనోపరివి
హితశాతకుంభదేదీప్యమానంబును విశ్వకర్మనిర్మితంబును నగుకిష్కింధానగరం
బు సొచ్చి ముందట నంగదమైందద్వివిదగజగవయశరభశతబలికుముదపనసనల
నీలవిద్యున్మాలిసంపాతివీరబాహుసుబాహుహనుమత్సుషేణరంభజాంబవదృప
భాదివీరవానరులగృహంబుల నాలోకించుచుఁ దదగ్రభాగంబునఁ గైలాసశిఖర

  1. వెలువంగ ననుచు