పుట:భాస్కరరామాయణము.pdf/267

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

నరవర లోకుల కెల్లను, శరణుఁడ వగునీవ దిక్కు సమ్మతి నాకున్
వరసుతుశోకము వాయఁగఁ, గరుణన్ రక్షింపుమయ్య కారుణ్యనిధీ.

331


వ.

అని తనతనయు నప్పగించి వాలి యన్నరేంద్రుతో మఱియు ని ట్లనియె.

332


క.

కనకశతపత్రమాలిక, యెనయఁగ నా కింద్రుఁ డిచ్చె నీమాలిక నే
ను నీవొండెను నీయను, జున కి మ్మొండెఁ దగ నిమ్ము సుగ్రీవునకున్.

333


వ.

అని పలికిన రామచంద్రుండు ముదం బంది యింద్రనందనుం జూచి నాశరంబు
నం బావనుండ వైతి వింక మహేంద్రలోకంబున కరుగు మని పలుకఁ దత్ప్రసా
దంబునకుఁ బ్రహర్షించె నప్పుడు రాముండు సుగ్రీవ నీ వీకాంచనమాలిక దాల్పు
మన నారామునియానతియు సుత్రామతనూభవుననుజ్ఞయుం బడసి హేమమా
లిక తామరసాప్తసూనుండు ధరియించె ననంతరంబ వాలి యంగదు నూరార్చి
దుఃఖంబు దీర్చి ప్రియంబున నిట్లనియె.

334


చ.

ఇనజుని చిత్తవృత్తిఁ జరియింపుము ని న్నతఁ డేనుబోలె మ
న్ననఁ దగఁ బ్రోచుఁ దద్రిపుజనంబుల సన్నిధి నుండ కర్కనం
దనునకు నర్థసంగ్రహ మొనర్పు మొగిన్ సుఖదుఃఖముల్ క్రమం
బున నిను దేశకాలములఁ బొందినఁ జేకొను మొక్కరూపునన్.

335


వ.

కుమారా నీ వింక నామీఁదిభక్తియు మోహంబును జాలించి దుఃఖం బుడుగు
మని యూరార్చె నంత నవ్వాలికి.

336


క.

కనుఁగవఁ జీఁకటి గవిసెను, మనమున మఱ పొదవె నెలుఁగు మందం బయ్యెన్
విను టుడిగె నవశ మయ్యెం, దను వసువులు సంచలించెఁ దల్లడ మొదవెన్.

337


వ.

అప్పుడు రామునిబాణంబు ప్రాణంబులు వెఱుకఁ గన్నులు తేలగిలవైచి తీక్ష్ణ
రదనంబులు గానంబడ వాలి వివృతాననుం డై జీవంబులు విడిచెఁ దదనంతరం
బ సకలవనచరులును హాహాకారంబులు సేయుచు నధికదుఃఖంబుల విలపించిరి
తార మృతుం డయినపతిం జూచి నేలం బడి పొరలి యాలింగనంబు సేసి ముఖా
స్వాదనంబు సేయుచు నధికశోకంబున హానాథ హవీరవరేణ్యా హాకపిశేఖరా
యీవిషమరణతలంబున నీ వొక్కరుండవు పడియున్నవాఁడవు ఋక్షవానరు లనే
కులు నిన్నుం బరివేష్టించి దుఃఖించుచున్నారు నన్ను నంగదు సుహృజ్జనుల నేల
సంతోషపఱుపవు నీపుత్రుం డయినయంగదుండును భృత్యామాత్యులుఁ జు
ట్టాలు నధికశోకంబున విలపించుచున్నారు మమ్ము నెఱుంగ వేల లెమ్మనుచుం బలికి.

338


సీ.

అంగదుచే వింటి నధిప సుగ్రీవుఁడు, కాకుత్స్థుశరణంబు గనియె నంటి
రాముప్రావున నిన్ను రవిజుఁ డాజికిఁ బిల్వ, వచ్చినవాఁడు పోవలవ దంటి
నారాముతో సంధి యలవడఁ గావించి, భయ మేది నెమ్మది బ్రదుకు మంటి
రాముండు నీచేత రణమునఁ జిక్కఁడు, శక్రముఖ్యులకు నసాధ్యుఁ డంటి
మనఁగ నాబుద్ధి వినక నా మన్నిగొంటి, వింక నీశోకవారాశి నెట్లు గడతు