పుట:భాస్కరరామాయణము.pdf/264

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని విలపించి రామచంద్రు నుద్దేశించి తార యి ట్లనియె.

296

తార రాఘవుని శపియించుట

మ.

పరుతోఁ బోరఁగఁ బొంచి నావిభునిఁ జంపం బాడియే నీకు లా
వరి వైనం బొడసూపి కయ్యమున నిల్వం జూచి దోశ్శక్తి మైఁ
బరఁగం జంపఁగ రాదె నీ కహిత మాపాదించెనే యీకపీ
శ్వరు నిష్కారణ మేల చంపి తతిదోషం బిట్లు గావింతురే.

297


క.

వనమున వన్యాశను లయి, యొనరఁగ మనువారి రామ యూరక చంపం
జనునె మహాత్ములు వనితల, వనచరుల నధర్మ మనుచు వధియింప రిలన్.

298


తే.

ఇత్తెఱఁగు దోష మగుట నీ వెఱుఁగకునికి, వాలిపాలియభాగ్యంబు వాలిపత్ని
నయిననానోముఫలము గా కరసిచూడ, నిజము నీ వేమి సేయుదు నృపవరేణ్య.

299


క.

నరవర యాకులకొఱకు, న్వరఫలయుతచూతతరువు నఱకఁగ నగునే
ధరణిజతోడనె నీసురు, చిరపుణ్యగుణమ్ము లెల్లఁ జెడిపోయె నొకో.

300


ఉ.

అక్కట నీవు వానరసహాయము గోరిన వాలి పంపఁడే
దిక్కుల కెల్ల వానరులు దిగ్గునఁ దాఁ జని భూరిశక్తి మై
రక్కసులన్ బలాఢ్యుఁ డగు రావణుని వధియించి సీత నీ
వక్కజ మంది చూచి ముద మందఁగ ముందటఁ దెచ్చి పెట్టఁడే.

301


క.

పోలఁ బతివ్రతఁ గావున, నోలిం బొలియన్ శపింప నోపుదు నీ వి
ట్లాలిం గోల్పడి వగలం, గ్రాలెదు నిను వేఱ యేల కడఁగి శపింపన్.

302


చ.

నరవర యి ట్లకారణమ నాపతిఁ జంపితి గాన యీవు బం
ధురభుజశక్తితో మహిజఁ దోకొని వచ్చిన సీత నీకడం
జిరతరకాల మింపుగ వసింపక నీ వతిదుఃఖపాటుతో
నెరియుచు నుండ భూమిఁ జొరని మ్మనుచున్ శపియించెఁ గిన్కతోన్.

303


వ.

అట్లు శపియించి దుఃఖించుచు నేలంబడి పొరలి యేడ్చుచు బహుప్రకారంబుల.

304


చ.

అడలుచుఁ దార వాలిశిర మంకమునం దిడి చూడ్కి బాష్పముల్
వడియఁగ నేడ్చుచున్న మఱి వాలి ప్రియాంగనరోదనంబు లే
ర్పడ విని నేత్రముల్ దెఱచి పత్నిఁ బ్రియాత్మజు దీనవక్త్రునిం
బొడగని దుఃఖ మంది రఘుభూపతిఁ జూచి యుదగ్రకోపుఁ డై.

305


వ.

అప్పు డధికదుఃఖితుం డై వాలి ప్రాణాంతకరం బైన వేదన సహింప లేక పరుష
వాక్యంబులతో రామచంద్రున కి ట్లనియె.

306


క.

శమమును దానము ధర్మము, క్షమయును బటువిక్రమంబు సత్యంబును శీ
లము దుర్జనశిక్షయు భూ, రమణునకుం గలుఁగవలయు రాజితగుణముల్.

307


వ.

వనమృగంబు లగుమా కీగుణంబులు వలదు గాని మీబోఁటి రాజులకు వలవదె