పుట:భాస్కరరామాయణము.pdf/261

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రనిమిషలోకము గాంతురు, సునిశితధర్మంబుచేత సుజనులు వోలెన్.

263


క.

కావున నాశరమునఁ దెగి, నీ వఘముల నెల్లఁ బాసి నిర్మలతరపు
ణ్యావాసం బగుదివిజేం, ద్రావాసంబునకుఁ బోయె దంచితమహిమన్.

264


చ.

అన విని వాలి రామునకుఁ బ్రాంజలి యై జననాథ బాణవే
దన సహియింపలేక నినుఁ దాఁకఁగ నాడితి నీవు వారిజా
సనదివిజేంద్రతుల్యుఁడవు సమ్మతి నన్ క్షమియింపు మాదరం
బెనయఁగ జూడు మంచును సమీక్షణతత్పరుఁ డయ్యె నయ్యెడన్.

265

రామబాణహతుం డగువాలిం జూచి తార లోనగువారు దుఃఖించుట

చ.

అలఘుఁడు వాలి రామవసుధాధిపుఘోరశిలీముఖంబుచే
నిలిగినవేఁడిమాట విని యెంతయు నుల్లము జ ల్లనంగఁ గొం
దలపడి తార యంగదుఁడుఁ దాను మహీస్థలి వ్రాలి బిట్టు మూ
ర్ఛిలి మఱి యెట్టకేలకు సుచేతన యై కనువిచ్చి చూచుచున్.

266


క.

అప్పుడు చాపధరుం డగు, నప్పురుషవరేణ్యు రాము నస్త్రహతుం డై
దెప్పర మొందినవాలినిఁ, దప్పక వీక్షించి రచటికి తరుచరు లెల్లన్.

267


ఉ.

ఎంతయు భీతి యూధపవిహీనమృగంబులుఁబోలె నార్తు లై
వంతలఁ బాఱు దేరఁ గని వాలి పరాక్రమశాలి రామభూ
కాంతునిచేతఁ జిక్కెఁ బ్లవగప్రభు మీపతిఁ బాసి దూరదే
శాంతర మేఁగుఁ డింకను వనౌకసులార యనూనదుఃఖు లై.

268


వ.

అని తార పలికిన విని యంగదసహచరు లగునవ్వాలిహితయూథపవీరు లేము
లుబ్ధకులు దమలో నాలోచనంబు సేయ వింటిమి వాలి రామబాణహతుం డై
చిక్కినయెడఁ గొందఱు సమీపకాననంబులం గళత్రవంతులు నిష్కళత్రులు
నయి మన కహితు లయిన మేటివనచరు లున్నవారు వారలు మనకుం గలగిరిదుర్గ
వనంబులను గిష్కింధానగరంబును నాక్రమింపకుండవలయు మామాటలు విను
మనుచుఁ దారతో నిట్లనిరి.

269


ఉ.

అంగన నీవు సేమమున నంగదుతో మరలంగ నేఁగు మీ
యంగదు వాలిరాజ్యమున కారఁగఁ బట్టము గట్టు శూరుఁ డై
యంగదుఁ డాప్తవానరసహాయత నీపురి యేలనిమ్ము వా
లిం గడతేర్చె నంతకుఁడు లీల భయంకరరామమూర్తి యై.

270


వ.

అనినఁ దార వారల కి ట్లనియె.

271


చ.

అకట సురేంద్రపుత్రుఁడు మహాత్ముఁడు రామశరాభిఘాతుఁ డై
యొకరుఁడ యున్నవాఁడు సమరోర్వి శయించి మదీశుఁ డొక్కకు
త్తుక యగుచున్నయట్టిపతితోడిద లోకము నాకుఁ గాన హే
యక మగురాజ్య మేమిటికి నంగదుఁ డేటికి జీవ మేటికిన్.

272