పుట:భాస్కరరామాయణము.pdf/235

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నల్లవలిగాలి యుల్లంబు దల్లడిల్ల, బహువనప్రసవోదితపరిమళంబు
లలమి తెచ్చి పైఁ బొలసెడునళులు గలయ, మధురగీతము వాడెడు మనము గలఁగ.

425


ఘనతరశైలసానువులఁ గాంతయుఁ దానును గూడి వేడ్కతోఁ
జన రతిలీలఁ బొందుచు వెసం బురి విచ్చి మయూర మోలి న
ర్తన మొనరించుచున్నది ముదంబున నావరపత్నికైవడిం
దనప్రియఁ గొంచు రక్కసుఁ డుదగ్రతఁ బోవక యుండఁగాఁ జుమీ.

426


క.

సౌమిత్రీ కనుఁగొంటివె, ప్రేమంబున నలినిఁ గూడి పెంపొంది సుఖో
ద్దామత నున్నది మధుపము, గామిని వెసఁ గవసి యున్న కాముకుభంగిన్.

427


క.

వినుతింప సుఖులలోపల, ఘనతరసుఖి చక్రవాకఖగ మొక్కెడ వే
చనఁ దొడఁగె నీడకైవడిఁ, జనఁ బ్రియ వెనువెంటఁ దాను సమ్మతి గనుటన్.

428


క.

భూనాథపుత్ర పర్వత, సానువులం బ్రియలతోడిసంగతి మృగముల్
మానసము లలర నున్నవి, యేనైన మహీజఁ బాసి యి ట్లున్నాఁడన్.

429


ఉ.

ప్రేయసిఁ బాసి యేగతిఁ జరింతు సరిద్వనభూమిఁ దెమ్మెరల్
డాయఁగ వేఁడివెన్నెలలు డంబుగఁ గాయఁగఁ దావితూపులం
గాయజుఁ డేయఁగా నళులు గన్కని మ్రోయఁగ గండుఁగోయిలల్
గూయఁగఁ బుష్పవార మతిఘోరత మానము నీఱుసేయఁగన్.

430


వ.

అని పలికి తమకం బెసంగ.

431


క.

మంగళపవనమ నాదుప్రి, యాంగనపైఁ బొలసి పొలయు మాదట నాపై
నంగం బలఁపక పంపా, సంగతరంగత్తరంగశైత్యము లొలయన్.

432


వ.

అని సీతావియోగభరంబునఁ దాపంబు దీపింపఁ బెక్కుదెఱంగులం బ్రలాపించు
చున్న రామచంద్రు నూరార్చి మనము సుగ్రీవుతోడం జెలిమి సేయవలయు ఋ
శ్యమూకంబునకుఁ బొదం డని లక్ష్మణుండు పలికిన నగుం గాక యనుచు ననుజస
మేతుం డై పంపానది యుత్తరించి యవ్వలికూలంబున నిల్చి యగ్రభాగంబున.

433


ఉ.

రాకొమరుల్ గనుంగొనిరి రమ్యగుహాగతకిన్నరీకమున్
స్వీకృతనాకసింధుజలసేకము సంకులదంతిదంతిభి
ద్భీకరపుండరీకమును దీపితసంయమివేదనాదజ
ల్పాకము సిద్ధసేవితతపఃపరిపాకము ఋశ్యమూకమున్.

434


వ.

ఇట్లు కనుంగొని యన్నరవరోత్తములు సంతోషితస్వాంతులై విశ్రమించియుండి
రంత.

435


శా

వైరిక్ష్మాతలనాథపర్వతమహావజ్రాయుధున్ ఘోరదు
ర్వారాంహఃప్రథితారిదుస్సహతమిస్రప్రస్ఫురద్భాను గం