పుట:భాస్కరరామాయణము.pdf/224

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్షేపములన్ గళద్రుధిరసిక్తశరీరునిఁ జేయఁ జెచ్చెరన్.

352


వ.

అలుకు గొని యన్నిశాచరుండు.

353


మ.

విరథుం డై సతి డించి బెగ్గలమునన్ వేగంబుతోఁ బాఱఁగా
బిరుదారన్ వెనువెంటఁ బాఱి కడు దప్పిం బొంది యే నుండ భీ
కరఖడ్గంబునఁ బక్షముల్ దెగి పడంగా చేసి యాపంక్తికం
ధరుఁ డుర్వీసుత నెత్తికొంచుఁ జనియెన్ దర్పాతిరేకంబునన్.

354


వ.

అని పలుకుజటాయువుం బట్టి కౌఁగిలించుకొని సౌమిత్రిసమేతుం డై రాముండు
మహారోదనంబు సేసి యతిదుఃఖంబున.

355


సీ.

రామభూవిభుఁ డఫ్డు సౌమిత్రి కి ట్లను, రాజ్యంబు తొలఁగు టరణ్యవాస
మును దండ్రిచావును జనకజ వోవుట, మొదలుగ శోకాబ్ధి మునిఁగియుండ
నాపక్షమున వచ్చి యీపక్షినాథుఁ డా, తతవజ్రవాగురఁ దగులుపడియెఁ
బున్నమ నుప్పొంగుపూర్ణాబ్ధి శోషించె, నక్కట నాయభాగ్యంబుకతన
ఘనుఁడు మజ్జనకుసఖుఁడు ఖగకులేంద్రుఁ, డగుజటాయువు ఱెక్కలు దెగి మహాహ
వోర్వి రక్తసిక్తాంగుఁ డై యున్నవాఁడు, పొగులుచును నాదుపుణ్యంబు పొలిసెఁ గాన.

356


క.

అని వగచి జటాయువుతో, జనకజ నాప్రాణదయిత సద్వ్రత యేది
క్కున కరిగె ననుచు రాముఁడు, ధనువును బాణములు విడిచి ధరణిం బడియెన్.

357


వ.

పడి యాఖగపతిచేత సీతవృత్తాంతంబు విస్పష్టంబుగా విని రాముం డనుజసమే
తుం డై యిరువురు నెలుం గెత్తి వాపోవుచు నేలం బడి పొరలుచు మూర్ఛిల్లి
నిశ్చేష్టితు లై యుండి రంతఁ గొంతదడవునకు సౌమిత్రి దేఱి యన్నచరణంబు
లొత్తుచు నారాము బోధించి యోరామ దశరథుండు నీగుణంబులం గట్టువడి
భవద్వియోగంబు సైరింపఁజాలక తపోయోగమార్గంబునం బ్రాణంబులు విడి
చి నాకగతుఁ డయ్యె నని భరతుండు సెప్ప నీవు చరితవర్తనుండ వై సీతతోఁ
గూడ మరలి పురంబున కేతేర నిన్నుం గన్నులం జూచుజను లతిపుణ్యులు
నధికధన్యులు నతిసుముఖులునుంగాఁ బురాభిముఖుండ వై యరుగునిన్నుం
జూచి కౌసల్య పరమానందంబునం బొందు.

358