భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల
పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం.
దాదాపు ఒక శతాబ్దంపైగా సాగిన ఈ పోరాటాన్ని సుసంపన్నం చేసేందుకు జాతి, మత,
కుల, ప్రాంతీయతలను విస్మరించి భారతీయులంతా ఏకోన్ముఖంగా ఆత్మార్పణలకు
పోటిపడటం అపూర్వం. లక్షలాది ప్రజానీకం ఒకే నినాదం, ఒకే లలక్ష్యం కోసం ఒకే
బాటన ముందుకు సాగటం ప్రపంచ చరిత్రలోనే అరుదైన సంఘటన.
ఈ పోరాటానికి భారతదేశపు అతిపెద్ద అల్పసంఖ్యాకవర్గమైన ముస్లిం సమాజం
తనదైన భాగస్వామ్యాన్ని అందించింది. ముస్లిమేతర సాంఘిక జన సమూహాలతో మమేకమై
స్వాతంత్య్రసమరంలో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించింది. అపూర్వత్యాగాలతో, అసమాన
బలిదానాలతో భారతీయ ముస్లింలు పునీతులయ్యారు. అయినప్పటికీ ముస్లిం సమాజం
త్యాగమయ చరిత్ర పలు కారణాల మూలంగా మరుగున పడిపోయింది.
బ్రిీటిష్ పాలకులు తమ పాలనను సుస్థిరం చేసు కునేందుకు విభజించు-పాలించు
అను కుటిల నీతిని అమలుపర్చి భారతీయులను మతం పేరుతో హిందువులు-
ముస్లింలుగా విభజించటంలో కృతకృత్యులయ్యారు.
23
పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/26
ఈ పుట ఆమోదించబడ్డది