పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/252

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు

తెలంగాణ రైతాంగపోరాటంలో పోరుబిడ్డలను ఆదుకున్న ధైర్యశాలి

జైనాబీ

బలమైన శత్రువును సాయుధాంగా ఎదుర్కోవడం కష్టతరమైనప్పటికి సాయుధ పోరాట యోధులకు ఆశ్రయమిచ్చి ఆదుకుని కడుపులోపెట్టుకుని కాపాడగల ప్రజల అండదడలు లభించినట్టయితే ఏ పోరాటమైనా ముందుకు సాగుతుంది. శత్రుగూఢచారి డేగకళ్ళనుండి తప్పించుకోని ఆశ్రయమివ్వటం, ఆదుకొనటం సామాన్య ప్రజలకు కష్టతరమైన పని. ఆ కర్తవ్యాన్ని నిర్వహించబూనుకున్న ప్రజలు అత్యంత జాగురూకులై మెలగాల్సి ఉంటుంది. కట్టుతప్పితే, పట్టుజారితే ఆదుకున్న వారి ప్రాణాలకు మాత్రమే కాకుండ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యామకారుల ప్రాణాలకు, ఉద్యమాల మనుగడకు పెనుప్రమాదం దాపురించగలదు. అటువంటి క్లిష్టతరమైన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సాహసోపేతంగా నిర్వహించిన పలువురు మహిళలున్నారు. ఆనాటి మహిళామతల్లులలో శ్రీమతి జైనాబీ ఒకరు.

అటు నిజాం పాలకులకు చెందిన రజాకారుల, ఇటు భారతీయ సెన్యం కళ్ళుగప్పి తెలంగాణ రైతాంగపోరాట యోధులకు అందండలుగా నిలచిన జైనాబీ రాజారం గ్రామం నివాసి. చిన్నతనంలో భర్తను పోగొట్టుకున్న ఆమె తన అన్నదమ్ములు, ఒక్కగానొక్క కుమారునితోపాటు రాజరంలో ఉంటున్నారు. అన్నదమ్ములు, కుమారుడు కూలీనాలీ చేసుకుని బ్రతుకు బండిన భారంగా ఈడ్చుతున్న కుటుంబం ఆమెది. భయానక పేదరికం


249