పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు



యింట్లో వుండే వాళ్ళు.1947 తర్వాత లక్నోలో హిందీ కాన్పరెన్స్‌-మౌలానా ఎసియాటిక్‌ కాన్పరెన్స్‌- వెళ్ళాం. అక్కడ ఎర్రజెండాలు ఎగరేశాం. చాలా మంది అరెస్టయ్యారు.

ఆ క్రమంలో ప్రముఖ కమ్యూనిస్టు నేత ప్రమీలా తాయిని జమాలున్నీసా కలుసుకున్నారు.1946లో ఆమె కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు.1946 నవంబరులో పార్టీ మీద నిషేధం విధించబడింది. కమ్యూనిస్టు పార్టీ మీద విధినిషేధాల కారణంగా, నిజాం ప్రబుత్వం చర్య ల మూలంగా చాలా రహస్యంగా ఆమె కార్యకలాపాలను నిర్వహించాల్సి వచ్చేది. నాయకులకు, పార్టీ కార్యకరలకు ఆశ్రయంకల్పించటం, ఆహారం అందించటం, నాయకుల మధ్య సమాచారం చేరవేయటం, ఆయుధాలను సరఫరా చేయటం, ఆయుధాలను దాచిపెట్టటం లాంటి బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించారు. ఈ విషయంలో అమె కుటుంబ సభ్యులు కూడ ఎంతో సాహసంతో కార్యక్రమాలలో ప్రముఖ పాత్రవహించారు. ఆ విషయాలను కూడ అమె ఈ క్రింది విధంగా వెల్లడించారు.

నేను బయటకు వెళ్ళలేకపోయేదాన్ని కాదుకాని అండర్‌ గ్రౌండ్‌లో ఉన్నవాళ్ళు వచ్చి ఉండిపోయేవారు. భర్తతో వాళ్ళు నా అన్న స్నేహితులని చెప్పేదాన్ని. మా కుటుంబం వాళ్ళనంతా చూసి క్రమంగా ఆయనకొక నమ్మకం కుదిరింది. నా అన్న తమ్ముళ్ళంతా కాలేజీలు వదలి ఉద్యమంలో చేరి చాలా బాధలుపడ్డారు. అయుధాలిక్కడే దాచేవారు. అన్వర్ , జఫర్‌, నా అన్న వరస హఫీజ్‌ వీళ్ళంతా కలసి పనిచేసేవారు. వాళ్ళంతా అరెస్టయ్యారు. అన్వర్ చాలా సీరియస్‌ జబ్బుతో బాధపడుతుండేవాడు. ఖమర్‌, మజర్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉండి అరెస్టయ్యారు. అన్వర్ అతగారిల్లు ఎక్కడో దూరంగా హబ్సీగూడ రామాంతపూర్‌లో వుండేది. మఖ్దూం, ఓంకార్‌ అక్కడే ఉండేవాళ్ళ. మఖ్దూం, జఫర్‌, షఫీఖ్‌, బెవ్‌జద్‌తోపాటు అరెస్టయ్యాడు....జఫర్‌ సాయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఊళ్ళకి వెళ్ళి, అక్కడి పరిస్థితులను చూసి నిరాశతో తిరిగి వచ్చాడు. జఫర్‌ రివాల్వర్లను దాచిపెడితే, అఖ్తర్‌ వాిని ఒక పెటెలో పెట్టి పోలీసులు వచ్చిప్పుడు వాటిపెన కూర్చుంది. ఆమె మురాద్‌ నగర్‌ వెళుతూ రివాల్వర్‌ నాకిచ్చింది. నేను దాన్ని ఇక్కడే దాచాను.

జిన్నా ఇంటిర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లజెండాల ప్రదర్శనలిమ్మని పిలుపునిచ్చాడు. అందరూ దాన్ని పాటించారు. కాని మేము పాటించలేదు. మా అన్నలు ఎర్రజెండా ఎగురవేశారు. చుట్టుపక్కల వాళ్లంతా ఇష్టపడలేదు. రాజ్‌ బహుదూర్‌ గౌడ్‌, జవార్‌ (జవ్వాద్‌ రజ్వీ) హస్పిటల్‌ నుంచి తప్పించుకుని ఇక్కడికే మొదలు వచ్చారు. 1947 ప్రారంభంలో ఎక్కడ చూసినా పోలీసులుందేది. రిక్షాకు పర్దాకట్టించి వాళ్ళనిక్కడి

243