పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/244

ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం :ముస్లిం మహిళలు


పేరుతో సాహితీ మిత్రుల సంఘం ఏర్పాటు చేశారు. ఆ సంఘం ఆధ్వర్యంలో వారి ఇంట సాహితీ సమావేశాలు, చర్చలు, గోష్టులు జరిపారు. ఆ సమావేశాలలో పలువురు యువ రచయితలు-కవులు పాల్గొనేవారు. ఆ సత్సంగంలో సాహిత్య చర్చలకు మాత్రమే పరిమితం కాకుండ ప్రజల సమస్యల గురించి, జాతీయోద్యమం గురించి, సామ్యవాద భావాల గురించి, కమ్యూనిస్టు పార్టీ గురించి, అహేతుకు ఆచారసంప్రదాయాల మీద విశ్త్రుతంగా చర్చలు సాగేవి. ఆ చర్చలలో జమాలున్నీసా తన సోదరి రజియా మాత్రమే కాకుండ ఆమె అన్నదమ్ములు కూడ భాగస్వామ్యలయ్యేవారు.

ఆ కార్యక్రమాలలో భాగంగా ఏర్పడిన భావాల మూలంగా పరాయి పాలకుల పెత్తనం నుండి మాత్రమే కాకుండ మతమౌఢ్యం, ఛాందసం భావాల నుండి కూడ ప్రజలు విముక్తి కావాలని ఆమె ఆశించారు. ఇస్లాం మతం ప్రబోధించిన మౌలిక ధార్మిక సూత్రాలకు వ్యతిరేకంగా వివిధ ఆహేతుక కర్మకాండలు స్వమతస్థులలోని ఆచార సంప్రదాయాలలో చోటు చేసుకున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. అటువంటి ఆహేతుక సంప్రదాయాలను ఆమె నిరాకరించారు. ఆ వివాదాస్పద విషయాల మీద చర్చలు జరిపారు. ముహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజు పండుగను (మిలాద్‌- యే-నబి) పురస్కరించుకుని చర్చా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సందర్భంగా ఇస్లాం మతం యొక్క నిజమెన సారాంశం వివరిసూ, కొంత మంది ముస్లింలు అనుసరిస్తున్న అహేతుక


241