పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/18

ఈ పుట ఆమోదించబడ్డది

డాక్టర్‌ అస్గర్‌ అలీ ఇంజనీర్‌ ప్రముఖ రచయిత ముంబాయి.

ఆప్త వాక్యం

స్వాతంత్యోద్యమంలో పాల్గొన్నముస్లిం మహిళల మీద 1999లో మిత్రులు సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ తెలుగులో రాసిన పుస్తకం అశేష పాఠకాదారణ పొంది తృతీయ ముద్రణ వచ్చిందని తెలిసి సంతోషిసు న్నాను. 1999 నాటి పుస్తకం 2003లో పునర్ముద్రణ కావటం, ఆ తరువాత 2006లో తృతీయ ముద్రణకు రావటం రచయితగా సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ కృషికి తెలుగు పాఠకుల నుండి లభించిన గుర్తింపుగా భావించవచ్చు. 1999 నాటి పుసకంలో పొల్చితే 2003 నాటి పుస్తకం అదనపు సమాచారం పరంగా చాలా బాగా వచ్చింది. ఆనాి పుస్తకాన్ని ప్రస్తుత గ్రంథంతో పోల్చి చూస్తే, ఇది పరిమాణంలోనే కాదు నాణ్యత విషయంలో కూడ చాలా బాగా వచ్చిందని పుస్తకం చూస్తేనే తెలుస్తుంది. ఈ పుస్తకంలో చాలా చిత్రాలు, ఫోలు ఉన్నాయి. ముస్లిం మహిళల చిత్రాలు, ఫోటోలు సేకరించటం చాలా కష్టం. రచయిత నిరంతర కృషి, అవిశ్రాంత అన్వేషణ మంచి ఫలితాలనిచ్చాయి. 2004 లో జరిగిన ఓ జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఢిల్లీ వచ్చిన సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ నాతో మ్లాడుతూ భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం పాత్రను వివరిస్తూ తాను రాసిన భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు మూడోసారి పూర్తి మార్పులు-చేర్పులతో ముదరాణ కానున్నవిషయం నా దృష్టికి తెచ్చినప్పుడు చరిత్ర పట్ల తెలుగు పాఠకుల ఆసక్తి అభిరుచిని అభినందించకుండా ఉండలేకపోయాను. 1999 నాి తొలి ప్రచురణ సందర్బంగా 'ముస్లిం సమాజం పట్ల సృషించబడిన అపోహలు, అపార్థాలను తొలగించేందుకు ఇటువంటి గ్రంథాలు అనేకం రావాలి. అవి విస్తృతంగా ప్రజలలోకి ప్రవహించాలి. ఈ గ్రంథానికి పాఠక మిత్రుల అశేష

15