పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/9

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

9


వ.

అని యివ్విధంబునం గృష్ణు డానతిచ్చిన యదువీరు లమ్ము
సలంబు పట్టుకొని సముద్రతీరంబునం గలుగుమహోపలంబుమీద జూర్ణం
బుగాఁ దివిచి జలంబులం గలిపి తత్కీలితమగు లోహఖండంబును
సరకుసేయక సముద్రంబునం బడవేయ నది మత్స్యంబు గ్రహించు
టయు, నానుత్స్యంబును లుబ్ధకుండు జాలమార్గంబునం బట్టి తదు
దరగతంబైన లోహఖండంబును బాణాగ్రఫలంబుగా నొనరించుట
యును నిట్లే తత్కథావృత్తాంతం బెఱింగించిన పరీక్షిన్నరేంద్రునకు
శుకయోగీంద్రుఁ డిట్లనియె.

39


సీ.

వినుము నృపాలక వివరించి చెప్పెదఁ
        బూర్వమయినకథ పొలుపు మీఱ
పరమేశభుజగుప్త పాలితద్వారకా
        నగరంబునకు వచ్చి నారదుండు
తద్దయుఁ గృష్ణసందర్శన కాంక్షియై
        హర్షంబుతోఁ దద్గృహాంతరమున
కరిగిన వసుదేవుఁ డమ్మునీంద్రునిఁ జూచి
        తఱితోడ నర్ఘ్యపాద్యముల నొసంగి
యుచితహేమాసనంబున నునిచి బంధ
పుష్పములచేత మిక్కిలి పూజచేసి
చేర డగ్గఱి యామౌని సేమమడిగి
పలికె నాతఁడు నమ్రుఁడై భవ్యచరిత.

40


క.

ఏనరుఁడైననుగానీ
శ్రీనాథుని చరణయుగము సేవించిన య
మ్మానవునకు నమృతము వి
న్నాణంబుగ నేవిధంబునం గవియునొకో.

41


సీ.

నీసమాగమ మది నిఖిలదేహములకు
        మంగళార్థంబు నిర్మలచరిత్ర
తల్లిదండ్రులభంగి ధరణి భూతములకు
        సుఖదుఃఖరూపమై సొంపుమీఱ