పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/8

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

భాగవతము


కవిరాజవిరాజితము.

అని యదుబాలకు లాడిన మాటలు మునులందఱు నాత్మదలం
చినఁ బరిహాసముచిహ్నలు దోఁచిన జిఱ్ఱనఁగోపము చిత్తములం
దెనయఁగ మోముల నెఱ్ఱలు దేరఁగ నీపశుబాలుర నీక్షణ చే
సిన యటమీఁదట జిహ్వల నిప్పులు చెచ్చెర రాలగఁ జెప్పి రయో!

32


క.

వాలాయము యదుకుల ని
ర్మూలకరంబైన యట్టి ముసలం బొక డి
బ్బాలిక కుదయించుం బొం
డాలస్యము లే దటంచు నటఁ బల్కుటయున్.

33


వ.

అంత మదోద్రేకాంధులైన యదుబాలకులు మునుల శాపదగ్ధులై
వణంకుచు సాంబుకుక్షి సిక్షిప్తచేల గ్రంథిమోచనంబు సేయు సమ
యంబున ముసలం బొక్కటి భూతలంబునం బతితంబైన విస్మయం
బంది, దానిం బట్టుకొని వాసుదేవసమక్షంబున కరుగుదెంచి ఏత
త్కథావృత్తాంతం బెఱింగించిన నంత డాత్మకల్పితమాయారూపం
బగుట యెఱింగియు నెఱుంగని యట్ల వారలం జూచి యిట్లనియె.

34


చ.

మదిమదినుండి యాదవ కుమారకులెల్లను మూఁకమూఁకలై
మదమునఁ గన్ను గానక సమగ్రతపోమహిమానురక్తులై
పొదలెడు సన్మునీశ్వరుల బొంకఁగఁ జేయుద మంచు వారలం
గదియఁగఁ బోవఁగా దరలె గ్రక్కున శాపము నాశహేతువై.

35


ఆ.

ఇట్టి విప్రశాప మేరీతినైనను
నడ్డుపెట్ట నొరుల కలవిగాదు
శర్వ కమలజాత శక్రాదు లైనను
దిరుగఁబెట్టలేరు తెలిసిచూడ.

36


వ.

అది గావున.

37


ఉ.

వారిధితీరమందు నొక వర్ణితమైన మహోపలంబు వి
స్తారముతోడ నున్నయది చక్కఁగ మీరట కేఁగి యాదవుల్
దారుణ బాహుసత్త్వములు దప్పక యీ ముసలంబు నూరఁగాఁ
జూరిన చూర్ణమంతయును జల్లుఁడు నీటఁ బడంగ సంగతిన్.

38