పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/66

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

ఏకాదశస్కంధము


ఉ.

శీరకరుండు నేను నతిచిత్రరథంబు నెక్కి వేడ్క న
క్రూరునితోడున్ మధురకున్ జనువేళ సమస్తగోపికల్
మారుని బారిఁ జిక్కువడి మమ్ములఁ బెాసిన జాముఁ బుత్తు రం
భోరుహజాతకల్పముగ భోజనభూషణవాంఛ జాఱ్పునన్.

270


క.

ఆ రమణులు నిజపతులను
నారూపముగాఁ దలంచి నయమార్గములన్
వారలతోఁ గ్రీడించెద
రారయ మద్భక్తిసహితలై విప్రవరా.

271


క.

ఈరీతిని గోపిక లవి
కారంబున భక్తియోగ కలితోద్యమలై
నేరుపున నన్నుఁ బొందిరి
యారయ నీక్షింప భక్తి కన్యము గలదే.

272


ఆ.

సుతధనాదులందు సతులందు గృహముందు
దేహమందు మిగుల నీహ మాని
భక్తి కలిగి చిత్తభవనంబులోపల
శరణు వొందు నన్ను సంయమీంద్ర.

273


వ.

ఈ విధమున నానతిచ్చిన వాసుదేవునకు మునివరుం డిట్లనియె.

274


క.

శ్రీవల్లభ కమలాసన
బావాంబుజమధ్యనిలయ పావనచిత్తం
బేవిధమున భ్రమియించును
దేవాధిప నాకు నానతీయఁగవలయున్.

275


వ.

అని పలికిన ధరణిసురునకు శౌరి యిట్లనియె. మునీంద్రా, దారుమధ్య
మానం బగు ననలంబు సూక్ష్మరూపంబున జనియించి సమిత్సమేధితం
బగుక్రమంబన సూక్ష్మతరంబున మద్రూపంబు గుణవర్ధితంబై భూతం