పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/58

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58

ఏకాదశస్కంధము


మదిలోన బుద్ధులు చెదరిపోవకమున్న
        యొడికమయినలావు చెడకమున్న
ఘనమారుతముల నంగములు దీయకమున్న
        ప్రాణముల్ దల్లడ పడకమున్న


గీ.

కంఠనాళంపుజాడ పైఁ గ్రమ్మి శ్లేష్మ
మగ్గలింపకమున్న దేహాభిమాన
ముడిగి దేహంబు నిజము గాకుంట యెఱిఁగి
సేయవలయును బరలోకచింత నరుఁడు.

244


చ.

సరసిజసంభవుండు నిజశక్తిని భూరుహపర్వతాదులన్
బురపశుపక్షికీటములఁ బొల్పుగ ధాత్రి సృజించి వానిచే
బరువడిఁ దుష్టిఁ బొందగ శుభంబున బ్రహ్మవిలోకనక్రియా
పరుఁడగు మానవోత్తమునిఁ బన్నుగఁజేసి తరించె వేడ్కలన్.

245


మ.

వినుతింపన్ బహుసంభవాంతముల సద్విజ్ఞానసంపన్నుఁడై
మనుజాకారముఁ బూని యందు వసుధామర్త్యత్వ మంగీకరిం
చినయాజీవుఁడు మృత్యువగ్గలికమై చెండాడుచున్నంతక
న్నను మున్నాఁడిఁ దలంపగాఁవలదె సన్మానమ్ముతో మాధవున్.

246


వ.

అని యివ్విధంబున నయ్యవధూత నిజవృత్తాంతం బెఱింగించిన విని
సంతసంబంది మత్పూర్వుండైన యదువు పుత్రదారధనాదులయందు
మోహంబుఁ బరిత్యజించి సమ్యగ్జ్ఞానసమేతుండై పరమపదంబు
నకుఁ జనియె నని యీయుపాఖ్యానంబు వాసుదేవుం డుద్ధవునకు
నానతిచ్చి మఱియు నిట్లనియె.

247


క.

కలిమందుఁ బుత్రదారా
ఫులయందు నయంబుఁగూర్మి పొదలుచునుంటల్
కలలోన రాజ్య మేలఁగఁ
గలిగినయ ట్లరసిచూడగా మునివర్యా.

248