పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/55

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

55


సీ.

ఒకనాఁడు ధరణిలో నొకవిప్రకన్యక
        కౌతుకంబున నింటి కావలుండి
బంధువు లేతేర భక్తితో వారల
        కతిముదంబునఁ పాద్య మర్ఘ్య మొసఁగి
తద్భోజనార్థమై [1]తతి రాజనంబులు
        వరుస దంపఁగ శంఖవలయపంక్తి
ఘల్లుఘల్లని మ్రోయఁ గడుసిగ్గుపడిఁ జేత
        నొకటి నిల్వఁగఁ వైచియున్నదాని


గీ.

వరుసతో నొక్కటొకటి పోవంగఁ జేసి
నంత నొరయిక లేనిచో నారవంబు
లణఁగిపోయిన సంతోష మగ్గలింప
దంచె రాజనములు బాల ధన్యశీల.

235


ఆ.

ఆ కుమారికంకణాళి చందంబునఁ
బెక్కుయుతులుఁగూడ బెనఁగు జగడ
మొక్కఁడైన మాట లుడిగి నిశ్చలచిత్త
సహితుఁ డగుచు బొందు సత్పదంబు.

236


మ.

శరకారుండు శరంబుమీఁద నిజదృక్స్వాంతంబు లేకంబుగా
నెఱి సంధించి దదేకనిష్ఠుఁ డగుచున్ వీక్షింపుచో ముందఱన్
తురగంబెక్కినరాజు గాంచినక్రియన్ దోరంబుగా యోగి బా
హ్యరుచిజ్ఞానము[2] మాని చేర్పవలయున్ యజ్ఞేశుపై జిత్తమున్.

237
  1. తతి=ఈశబ్ద మిచ్చట రహస్యము లేక యేకాంతము అనునర్థమునఁ బ్రయుక్తము—మూలములో:-
    తేషామభ్యవహారార్థం శాలీన్ రహసి పార్థివ। అవఘ్నంత్యాః ప్రకోష్ఠన్థాశ్చక్రుశ్శం ఖాఃస్వనం మహత్.
  2. పాఠాంతరము— రౌతు. కాని 'రాజు' పాఠము యుక్తమని తోఁచెడిని- మూలములో
    యథేషు కారో నృపతిం ప్రజంత మిషౌ గతాత్మో న దదర్శపార్శ్వే.