పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/52

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఏకాదశస్కంధము


క.

జిహ్వాచాపలసహితుఁడు
బహ్వాశాకలితుఁ డగుచుఁ బలితుండగు, నా
జిహ్వాచాపలరహితుఁడు
బహ్వమరసమేతుఁ డగుచు వడిఁ జను దివికిన్.

223


సీ.

నెఱి విదేహమహావనీపురమునఁ రాజ
        వీధిఁ బింగళ యను వేశ్య గలదు
తన్మూలమునఁ గొంతతత్త్వ మే నెఱిఁగితి
        నా కథావృత్తాంత మాదినుండి
విస్తరంబుగ నీకు వివరించి చెప్పెద
        విను మాదరంబున విమలచరిత
యావేశ్య యొకనాఁడు భావంబులో నర్థ
        సంగ్రహార్థం బాత్మసఖుని మొఱఁగి


గీ.

గరిమఁ గూరిమిసల్పు వాక్యములచేత
రాకపోకల వచ్చువారల మనంబు
లందు మన్మథభావంబు లాదుకొనఁగ
రమణ వర్తించె నిజమందిరంబునందు.

224


క.

ధనమిచ్చువానిఁ బిలిచెద
నని రాత్రిట నిద్ర మాని యామానిని వీ
థినిఁ దిరుగాఁడఁగ దన్మన
మున నొకనిర్వేద మొదవె ముక్తిప్రదమై.

225


వ.

ఇవ్విధమున నిద్రాసుఖము పరిత్యజించి విత్తాశాపరవశయై నిశా
సమయంబున రాజమార్గంబునఁ దిరుగాడుచు నధికశ్రమంబు నొందిన
యావేశ్యాలలామ మానసంబున నిర్వేదంబు జనియించిన నాత్మలో
నిట్లనియె.

226