పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/45

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

45


కామలోభదవాగ్నికలితులై జను నెల్ల
        సంతప్తదేహులై సంచరింప
పవమానసఖువల్లఁ బాసి గంగాజల
        స్థితమైన కరిరాజుగతిని బొల్చి
తాప మందక ఘనపదార్థముల యందు
వాంఛ వర్జించి యానందవశుఁడవై న
కారణం బెయ్య దిది నాకుఁ గ్రమముతోడ
నాన తీయంగవలయు విఖ్యాతచరిత.

184


వ.

అని పలికిన యదువరునకు నవధూత యిట్లనియె.

185


క.

గురువులు గల రిరువదినలు
గుమ నాకును వారివలన గుణమొక్కొకటిన్
బరికించి చూచి పొందితిఁ
బరమజ్ఞానంబు నుభయపావనచరితా.

186


చ.

అని యవధూత పల్కిన మహాద్భుతవృత్తి దలిర్ప వానికి
ట్లనియె యదుప్రభుండు వసుధామర యెవ్వరికైన నొక్కఁడే
వినుతగురుండు గాని పదివేవురు లేరిట నీవు నాకుఁ జె
ప్పిన వచనంబు చాల విని పెద్దవిచారము దోఁచె నామదిన్.

187


వ.

ఇట్లు యదుపుంగవుండు యుక్తియుక్తవచనంబులు పలికిన యతి
వరుం డిట్లనియె.

188


గీ.

అడిగినట్టి మాట కనువుగా నుత్తరం
బీయకున్న జ్ఞానహీనుఁ డండ్రు
గాన నుత్తరంబు క్రమముగాఁ జెప్పెద
రమణ నీవు సేయు ప్రశ్నలకును.

189