పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/39

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

39


వ.

అంత.

159


సీ.

ఘూకసృగాలాది ఘోరజంతువు లెల్ల
        పగలు విజృంభించి పలుకఁదొడఁగెఁ
గాకకుక్కుటశుకక్రౌంచశారికములు
        రాత్రికూజితముల రమణ మెఱఁగె
నశ్వవారంబులం దనలంబు వెలువడె
        విలసితాన్నంబులు మొలకలెత్త
నురువడిగృహములం దుత్పల లుదయించె
        నొకజీవమునకు వేఱొకటి పుట్టె
కడకు నీరీతి ననుదైవికమ్ములైన
ద్వారపుకాపుర సంభవోత్పాతములను
హరి నిరీక్షించి వరుసతో నాత్మపాద
భక్తులగు యాదవులఁ జూచి పలికె నంత.

160


ఆ.

పొందరాని యట్టి భూదేవశాపంబు
దగిలె వంశమునకుఁ దప్పదెచట
నిచట నుండవలవ దీరీతిగను మహో
త్సాతములు జనించెఁ బట్టణమున.

161


వ.

అదిగాన సముద్రతీరంబున ప్రభాసతీర్థంబను పుణ్యతీర్థంబు గలదు.
అందు దక్షుశాపదగ్ధుఁడై నిశాకరుండు స్నానముచేసి రాజయక్ష్మ
వలన విముక్తుండై కళోదయంబు నొందె, నట్టి క్షేత్రంబునకుం
జని భూసురపితృదేవగణంబులం దృప్తిబొందించిన మనకు సకల
దురంతంబులు నివర్తించు; నని వసుదేవతనూభవుం డానతిచ్చిన
యాదవులు సకలపదార్థఫూజితంబులైన శకటంబులు సమకూర్చి
పుత్త్రమిత్త్రకళత్త్రాదిసమేతులై ప్రభాసక్షేత్రంబునకై ప్రయా
ణాభిముఖులైన సమయంబున.

162