పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/37

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

37


కంఠికంబైనదామంబుతోఁ గూడి సంస్పర్థియై లక్ష్మి వక్షఃస్థలంబందు నిత్యం
బు వర్తించు ముక్తిప్రదా పద్మజాతాదిబృందారకానీకముల్ గోప
గోగోపికారూపముల్ దాల్చి నీ పాదభక్తిన్ ప్రవర్తింతు రత్యంతముం
జూడ మాయామహాపూరుషాన్యంబులై యున్న కాలస్వరూపంబు
దానైన నీపాదకంజంబు మాకెప్పుడు న్మంగళార్థం బవుగాక; పద్మోద్భవుం
డాది నిర్మించే హేమాండ ముర్వీధరారణ్యరూపాభిరామంబుగాఁ జక్ర
హస్తా జగత్స్వామివై నీవు మాయాగుణోత్థంబులైనట్టి యర్థంబులం
బొంది తద్గ్రాహివై పద్మపత్త్రంబులో నీటిచందాన లిప్తుండవుంగాక
వర్తింతు వింద్రాదివంద్యాసమస్తావనీభార నిర్వాపణార్థంబు వై దేవకీ
దేవి గర్భాబ్ధిలో నుద్భవంబంది సంసారిదేవారి సంఘంబుల న్మర్త్యరా
జన్య వర్గంబులన్ ముత్తి యత్యంతహర్షంబుతో నల్లరేపలైలో గొల్ల
వారిండ్లు శోధించి చోరాధినాథుండవై బాలగోపాలురంగూడి తోడెట్టు
పాలందులో మీగడల్ వెన్నలున్ మెక్కి యొక్కుమ్మడిన్ వమ్ముగా
కుండ క్రీడింతు వాశావిషాధీశతల్పా మనోజాత బాణానలాభీల కీలాభి
సంతప్తులై యున్న యీషోడశస్త్రీసహస్రంబులున్ యుష్మదీయేంద్రి
యక్షోభ సేయంగలేరైరి నీపాదతీర్థంబు లోకత్రయంబున్ బవిత్రంబుగాఁ
జేయు సర్వాత్మకా! సర్వవంద్యా నమస్తే నమస్తే నమస్తే నమః.

150


క.

ఈ రీతిని వసుదేవకు
మారకుఁడై వెలయునట్టి మధుసూదనునిన్
నీరజభవ భవముఖ బృం
దారకులు నుతించి రధికతాత్పర్యమునన్.

151


వ.

అంత నాఖండలాది దేవతామండలంబున కధినాయకుండగు చతు
ర్ముఖుండు పుండరీకాక్షునకు వెండియు నిట్లనియె.

152


ఆ.

పూర్వమందు నీవు పుడమి భారము మాన్ప
నవతరించి దిశలయందుఁ గీర్తి
సత్యసంధులందు సకలధర్మము నిల్పి
సవడి నొంది తసురనివహములను.

153