పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

ఏకాదశస్కంధము


నొందిన విస్మయంబంది యమ్మిథిలేశ్వరుండు కర్మానుష్టానంబు
సమాప్తించి జ్ఞానయోగం బవలంబించి తన్మూలంబునఁ బరమపదం
బునకుం జనియె; నీయుపాఖ్యానంబుఁ బఠించిన వినిన నరులు హత
కిల్బిషులై విష్ణులోకనివాసు లగుదు రని నారదుండు వసుదేవున
కీవృత్తాంతం బెఱింగించి మఱియు నిట్లనియె.

138


క.

భగవద్భక్తికి సాధన
మగు నీధర్మముల వినియు హతకలుషుఁడవై
సుగతికిఁ జనియెద వీము
జ్జగములు వినుతింప విగతసంగుఁడ వగుచున్.

139


క.

నీకీర్తులు నిర్మలమై
లోకంబులఁ బూర్ణమయ్యు లోకోత్తర యీ
శ్రీకాంతుఁ డుద్భవించెను
మీకుం దనుజాతుఁ డగుచు మేదినీలోనన్.

140


క.

శ్రీహరిపైఁ దనుజాత
స్నేహం బొనరించి వర్ణనీయం బగుమా
దేహములు శుద్ధిఁ బొందెడు
నాహారాలింగనోజ్జ్వలాలాపములన్.

141


క.

పగఁగొని శిశుపాలాదులు
భగవంతుని నతివిలాస భావస్మరణం
బొగిఁ జేయుచు ననుదినమును
సుగతికిఁ జని రెచట నిట్టిచోద్యము గలదే.

142


క.

ఎడపక రివుల వధింపను
బుడమిని నవతీర్ణుఁడైన పురుషోత్తముపైఁ
గొడు కనియెడి మోహం బది
విడువుము వసుదేవ సర్వవిద్యార్థజ్ఞా.

143