పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

హరిభట్టారకుఁడు


క.

నలినాక్షుని కీర్తనమునఁ
గలుగును మోక్షం బటంచు ఘనులైన మునుల్
కలియుగమున వినుతింతురు
కలదే మఱి లాభ మింతకన్న నృపాలా.

135


క.

వినుతింపఁ గృతయుగాదుల
ఘనులగు నరవరులు కలియుగంబున దఱచై
జననంబుఁ గోరుచుందురు
వనజూక్షుని లోకమందు వసియించుటకై.

136


సీ.

ద్రవిడదేశంబునఁ దామ్రపర్ణీనది
        కావేరి యను పేరఁ గలుగు పుణ్య
దివ్యవాహినియుఁ దోతెంచి మహానది
        ప్రవహించుఁ దజ్జలపాన మెవ్వ
రొనరింతు రాజను లుర్వీశ పితృదేవ
        మునిఋణంబుల వలన ముక్తు లగుదు
రచట దీపంబు నిత్యంబు సేయుచు విష్ణు
        పాదాబ్జముల భక్తి బరగువారి
నఖిలలోకేశుఁడైన శ్రీహరి పరేశుఁ
డాదిశూన్యుండు శ్రీనాధుఁ డవ్యయుండు
నిఖిలజీవాంతరంబుల నిలుచువాఁడు
చెడని యాత్మీయపదమునఁ జేర్చు మిగుల.

137


వ.

అని యివ్విధంబున ఋషభకుమారులైన భగవత్ప్రతిబింబంబులైన
యోగివరులు విదేహనరపాలకునకు నవ్యయపదప్రాప్తికరంబులైన
భాగవతధర్మంబుల నుపదేశించి తత్పూజితులై యంతర్ధానంబు