పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/32

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

ఏకాదశస్కంధము


నురుగా యుండు నని బ్రహ్మవాదులచేత వినుతి సేయంబతును; ద్వాపర
సంభవుండై పరమేశ్వరుండు శ్యామలదేహుండునుపీతాంబరధరుండును
బాహుద్వయోపశోభితుండును దివ్యనిజాయుధధరుండును శ్రీవత్స
కౌస్తుభవనమాలావిరాజమానుండును మహారాజోపలక్షణుండునునై
వాసుదేవ సంకర్షణానిరుద్ధ ప్రద్యుమ్ననారాయణ మహాపురుష విశ్వే
శ్వర విశ్వరూప సర్వభూతాత్మ కాదినామంబుల వెలయుచు నరపాలపుం
గవులచేత సన్నుతింపఁబడు. కలియుగంబందు కృష్ణవర్ణుండై పీతాం
బరధరుండై దివ్యనిజాయుధ శ్రీవత్సకౌస్తుభవనమాలాకిరీటధరుండై
హరి- రామ- నారాయణ నృసింహ- కంసారి - నలినోదయ నామంబుల
వెలయుచు భక్తరక్షకుం డగు పుండరీకాక్షుండు బ్రహ్మ మునీంద్రులచే
యజ్ఞసంకీర్తనలచే వినుతి సేయంబడు నని చెప్పి మఱియు నిట్లనియె.

131


క.

హరి కమలాసన చింత్యము
పరిభవహరణంబు భక్తపాపఘ్నము సు
స్థిరపదసంధాయక మగు
హరిపాదజలంబుఁ దలతు ననురాగమునన్.

132


గీ.

సకలదేవబృందసంప్రార్థితంబైన
రాజ్యలక్ష్మి విడిచి రమణి కోర్కి
కై మృగంబు వెంట నడవిలోఁ దిరుగాడు
నట్టి మూర్తిఁ దలఁతు నాత్మలోన.

133


క.

ఈరీతిని బ్రతియుగమున
నారాయణుఁ డవతరించి నరముఖ్యులచే
శౌరినృసింహుడు హరికం
సారన వినుతింప బడుఁ బ్రసన్నతతోడన్.

134