పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/3

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

3


యంతలోపల నిజభక్తులైన యాద
వుల సమూహంబు చెలరేఁగి పొదవఁజూచి
ఋషుల శాపంబు దలపోసి రోషమంది
తద్వినాశము సేయంగ దలఁచి యపుడు.

9


మ.

విదితుండై సకలామరుల్ వొగడ నుర్వీభారమున్ మాన్చి దు
ర్మదసంయుక్త వనుంధరాధిపతులన్ మర్దించి కంసాదులన్
దుదముట్టన్ వధియించి కృష్ణుఁ డతిసంతుష్టాత్ముఁడై యున్నచో
యదుసైన్యంబులు భూమిలోనను నసహ్యం బయ్యె నత్యుగ్రమై.

10


వ.

ఇవ్విధంబున యశోదానందనుండు పూతన, కేశి, ప్రలంబ, తృణా
వర్త, శకట, ధేనుక, వత్స, ముష్టిక, చాణూర, కంస, సాల్వ,
శిశుపాల దంతవక్త్రాదులం బరిమార్చి దుర్ద్యూతనిమిత్తంబునఁ
గురుపాండవసైన్యంబుల నేపణంచి యంత నిజసేవాపరులైన యాద
వులబలంబు లుదిలంబులై భూమికి వెక్కసంబులై వ్రక్కతిలుచు
వర్తించునెడ వారలం జూచి మనంబున నిట్లనియె.

11


గీ.

మత్సమర్పితశక్తిచే మలయుఁ గాన
నన్యపరిభవ మెఱుఁగ దీయదుబలంబు
వీరిఁ బరిమార్ప నేఁదక్క వేఱె మఱొక
దైవ మోపునె త్రిభువనాంతరములందు.

12


క.

అని విప్రశాపమూలం
బున యాదవబలము నణఁచి భూభారము మా
న్చిన మీఁదఁ బరమపదమును
జనియెన్ వసుదేవసుతుఁడు సంరంభమునన్.

13


వ.

అని పలికిన మునివరునకు రాజవరుం డిట్లనియె.

14


సీ.

బ్రహ్మణ్యులై జగత్పావనమూర్తులై
        వాసుదేవాంఘ్రి సేవాధురీణు
లగునట్టి యాదవులకు నెట్లు భూదేవ
        శాపంబు దగిలె నాశాప మెట్లు