పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/26

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఏకాదశస్కంధము


గుణంబులు సన్నుతింప బ్రహ్మరుద్రాదులుగాని మదీయవాచాగోచరంబు
గాదు. మావలని యపరాధంబులు సహింపవలయునని దండప్రణామ
పూర్వకంబుగా సన్నుతించి సమ్ముఖంబున నిలిచి యున్నసమయంబున.

102


క.

ఆ మునివరుఁడు సృజించెను
కామినులను నూరురోట్ల ఘనభూషణులన్
ఆ మానినులను జూచిరి
వేమఱు సురలోకసతులు విస్మయయుతులై.

103


వ.

ఇట్లు నారాయణమునీంద్రుఁడు నిజశరీరంబు వలనఁ గాంతల
సృజించి యంత.

104


గీ.

వీరిలోన నొక్క నారీశిరోమణి
బొదుపుమీర దొడొక పొండటంచు
సొరిది నమ్రులైన సుకలోకకాంతల
కానతిచ్చె మునివరాగ్రవరుఁడు.

105


వ.

అని మునీశ్వరుఁ డివ్విధంబున నానతిచ్చిన దేవతలా వనిత
సతులందు మిక్కిలి వర్ణితంబగు నూర్వశింగొని దివంబున కేగి యీకథ
గోత్రభేదను పెద్ద కొల్వునఁ దగ న్వినిపింపఁ జిత్తములోన నింద్రుఁడు
బెగ్గిలెన్.

106


క.

ఈ నారాయణ చరితం
బేనరుఁడు పఠించు నాతఁ డిహలోకమునన్
మానిత సంపత్సహితుం
డౌ నరహరి పదముఁ జేరు నటమీఁదఁ దగన్.

107


సీ.

పరమహంసుని స్వరూపంబున ఋషుభుని
        కాత్మయోగముఁ జెప్పి యచ్యుతుండు
ధారుణిలో జగద్భారావతరణంబు