పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/25

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

25


త్కరములను భేదపఱచెను
దిరముగ నామౌని హృదయదేశం బధిపా.

98


క.

జలచరకేతన మాయెను
దలకక హృదయంబులోనఁ దాత్పర్యముతో
బలభిన్మాయను ఋషి దాఁ
దెలిసి కనుంగొనియె నచటి దేవాంగనలన్.

99


వ.

అంతట నారాయణమునీంద్రుఁ డకాలవసంతాగమము నిరీ
క్షించి మనంబున దిరంబుఁ దప్పక కాంతాజనసహాయుండైన మదను
నాలోకించి యిట్లనియె.

100


క.

వెఱవకుము మత్స్యకేతన
సురకాంతాజనములార సొంపున నిచటన్
కరమొప్ప గ్రీడ సల్పుఁడు
పురుహూతుని యాజ్ఞ చేసి పూజితు లగుచున్.

101


వ.

అని నారాయణ మునివరుం డానతిచ్చిన యాజ్ఞానమితకంధ
రులై సురకామిను లిట్లనిరి. దేవా! పరమపదంబు కొఱకు సమ్యత్ జ్ఞాన
భరితులై నిశ్చలంబున పుత్రదారాప్త గృహ పశుద్రవ్యంబులయం దా
సక్తి వర్జించి పరమపదనివాసంబు కొఱకు తపం బొనరించు పరమ
పుణ్యులకు సుకృతంబులైన విఘ్నంబులు ప్రాప్తం బగుఁ గాని బర్హిస్సు
లందు సురభాగంబు లైన బలులం బెట్టెడి కర్మనిష్ఠులకు దత్కృతాంతరా
యంబులు చెందవు. క్షుధయు, తృష్ణయుఁ ద్రికాలగుణంబును పంచ
మారుతంబులును జిహ్వమేహన వికారంబు లనియెడి మహాసముద్రము
లును పరమయోగి మనోవికారగుణంబులగు మమ్మును దరియింపలేక
క్రోధవశులై తపంబును దిగనాడి గోష్పదోదకంబు నందె మునుంగు
దురు. మునిపుంగవా! నీ తపోమాహాత్మ్యం బచింత్యంబు భవదీయ