పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/24

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

24

ఏకాదశస్కంధము


తామసంబున రుద్రుఁడై తనరుఁ బరమ
పురుషుఁ డొక్కఁడు త్రిగుణసంపూర్ణుఁ డగును.

93


వ.

అట్టి నారాయణ చరిత్రంబుఁ జెప్పెద నాకర్ణింపుము.

94


సీ.

ధర్మరాజటఁ గాంచె దక్షుని సుతయిందు
        నారాయణాభిధానంబు గలుగు
శాంతుఁడైన మునీశ్వరు నాతఁ డొనరించె
        వైష్కర్మ్యమగు లక్షణంబు మిగుల
నఖిల సుజ్ఞానియై యఖిల సన్మునివంద్యుఁ
        డగు మునీశ్వరు నమరవిభుఁడు
ఈక్షించి శంకించి యిచ్చలో బెగ్గిలి
        యితఁడు మత్పదవిఁ గో దేగుదెంచు
ననుచు మదనుని రప్పించి యమరలోక
కామినులఁ గూర్చి వారి వేగంబుతోడ
నిమ్మహాత్ముని సామర్థ్య మెఱుఁగలేక
రమణఁబనిచెను బదరికాశ్రమమునకును.

95


వ.

ఇట్లప్సరోగణసమేతుండైన మదనుండు నిజబలంబులఁ గూడి
నారాయణాశ్రమంబుఁ బ్రవేశించె నంత.

96


చ.

వనమునఁ గల్గు భూజములు పర్ణితపల్లవ పుష్పసత్ఫలా
భినుతములయ్యు షట్చరణ బృందనినాద మనోహరంబులై
యనవరతంబుఁ గోకిల కలార వసంకులమయ్యె నాశ్రమం
బనయము గామినీసహితుఁడై మదనుండు చరించె నంతటన్.

97


క.

మరుఁదాయత సంతసమున
సురకాంతల చూపు లనెడి సురుచిరబాదో