పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/23

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

23


ఈశ్వరుండువిష్ణు డేమేమి కర్మంబు
లాచరించె నాకు నానతిండు
సొరిది యుష్మదీయ సూక్తులు విని నాదు
చితి మంతకంత చెంగలించె.

89


వ.

అని పలికిన నందు ద్రవిముం డిట్లనియె.

90


క.

భూరేణు వెన్నవచ్చును
నే రీతినినైనఁ ద్రిభువనేశ్వరు గుణముల్
(ధీరతవో) నెఱుఁగుదు మను
వారలు పో చాల బుద్ధివారు నృపాలా.

91


సీ.

ఆత్మసృష్టంబులై అధికమైన పంచ
        భూతసంఘంబుచేఁ బుర మొనర్చి
యాపురంబందు నిజాంశంబుచేఁ జొచ్చి
        నారాయణాభిధానంబుఁ గలుగు
నట్టి సన్ముని వరు నాదిదేవుఁడు వొంది
        నీ దేహ మాశ్రయం బీజగత్తు
లే మునీశ్వరుని రసేంద్రియముల చేత
        నీ దేహధారుల నింద్రియములు
పాలితములయ్యె మఱియు భూభాగమునను
జగము రక్షింప నిర్మింప సమయఁ జేయ
లాలి గుణనిష్ఠుఁడై రాజసంబు మెఱసి
దివిజగణములు మెచ్చ వర్తించు నతఁడు.

92


రాజసంబున బ్రహ్మయై రమణ మెఱసి
సత్వగుణమున విష్ణుఁడై జగము నిలిపి