పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/21

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము

21


యందుఁ బ్రవేశింప వీ రీతి నింద్రియంబు లాత్మయందుఁ బ్రవేశింపవు.
విశ్వంబు బోధకనిషిద్ధం బగుటంజేసి యర్థోక్తముఁ జెప్పును. మొదలను
సత్వ రజస్తమోగుణంబులను మహదహంకారరూపంబుగాఁ జెప్పుదురు.
మఱియు జ్ఞానక్రియార్థఫలరూపంబు గల దౌటంజేసి జీవంబుగాఁ జెప్పు
దురు. ఇది సదసద్రూపంబునం బర్యవసించు. దీనికి బెరయైనది పర
మాత్మగా నెఱింగి బ్రహ్మాదులు నన్ను సన్నుతింతురు. ఇట్టి పరమాత్మ స్థావర
జంగమాధిష్ఠితంబై వృద్ధి క్షయంబులం బొందక యుపలబ్ధి మాత్రయై
యండవిశితకలలాదులందు జీవంబుల బాసి తన్మధ్యంబుఁ వేఱయై వర్తించు.
మఱియు నయ్యాత్మ సర్వేంద్రియావృతంబగు నాకారంబు నష్టంబైన మనం
బునం బాసి స్మృతిలేక వర్తించు నిర్మలదృష్టిఁ గలవానికి సూర్యప్రకాశంబు
దోఁచినగతి జ్ఞానవంతుఁడు హరిభక్తిచేత గుణకర్మోత్థంబులైన విత్త
దోషంబులం బరిత్యజించి భగవత్పదంబు చేరునని చెప్పిన రా జిట్లనియె.

82


క.

పురుషుం డేకర్మము లా
చరించునో వానిచేత సత్కృతుఁడై శ్రీ
హరిపాదము లెటు చేరునొ
దురితంబులఁ బాసి సంతతోత్సాహమునన్.

83


వ.

అనిన విని యావీతిహోత్రుం డిట్లనియె.

84


సీ.

కర్మంబె కర్మనికర్మంబులగు వేద
        వాదంబు లౌకికవర్తితంబు
వేదసంఘములు సర్వేశురూపము గాన
        మొనసి విద్వాంసులు మోహపడుదు
రట్టివేదంబు కర్మాచారమునె చెప్పు
        జతురత కర్మమోక్షంబుకొఱకు