పుట:భాగవతము - ఏకాదశస్కంధము (హరిభట్టు).pdf/13

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏకాదశస్కంధము


సీ.

దివ్యకాంతులచేతఁ దేజరిల్లెడు మిమ్ము
        హరికి బార్షదుల నానెఱుఁగుచుందు
విష్ణురూపంబుల వెలయు మూర్తులు లోక
        పావనంబునకునై పరగుచుండు
క్షణభంగురములైన సకలదేహములందు
        మానుషాకారంబు పూను టరుదు
ఆమానవాకృతియందు దుర్లభమగు
        విష్ణు సద్భక్తులవీక్షణంబు
నట్లు కావున మిమ్ము నాత్యంతికస్వ
రూపమయినట్టి సేమంబు రూఢితోడ
నడుగవలసెను సంసారమందు సుజన
సంగతించుక సేపైనఁ జాలమేలు.

55


క.

నారాయణుఁడు ప్రసన్నుని
కేరీతిని నిజశరీర మిచ్చును దయతో
నారీతి విష్ణుకథలను
తేరకొనన్ నేడు నాకుఁ దెలుపుఁడు మీరల్.

56


వ.

అని యిట్లు విదేహుం డడిగిన హరిచరణస్మరణామృత
మత్తనిజస్వాంతులై శాంతులైన నవమునుల సమాజంబునందు
యను మహాత్ముం డిట్లనియె.

57


సీ.

ఉద్విగ్న బుద్ధిసంయుక్తుఁడయ్యు పదాత్మ
        భావుఁడై నిత్యంబు బరగునట్టి
వానికి సంసారవార్ధిలో నెప్పుడు
        నచ్యుతపాదయుగాబ్జసేవ
విశ్వంబు నాత్మయు వేఱుగా భావన
        సేయ జయం బెల్లఁ జెఱచు మఱియు
నజ్ఞులయినవారి నాత్మవిజ్ఞానార్థ
        మైహరి యేయుపాయములఁ జెప్పె