పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/591

ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

101


రాజును తొలగించి కొమారుని నిల్పిరి. రాజకీయకారణముల వల్ల నాభారాజును, దేవాస్ రాజును, ఆల్వారురాజును పదచ్యుతులుగ జేసిరి. బొమ్మమారినప్పుడెల్ల బ్రిటీషువారి సర్వాధికారమును పలుకుబడియు హెచ్చుచుండును.

III

కేంద్రపరిపాలన : ఇండియా గవర్నమెంటు

1858 మొదలు క్రొత్తరాజ్యాంగమున భారతదేశ ఆంతరంగికపరిపాలనమున హెచ్చుమార్పులు జరుగలేదు. దేశపాలనమునకు పూర్యమువలెనే గవర్నరుజనరలే అధిపతి. శాసనధర్మములందు వైస్రాయియనుపేరు లేదుగాని సామాన్యముగా అతడాపేరుతోనే వ్యవహరింప బడసాగెను.