పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/97

ఈ పుట ఆమోదించబడ్డది

90

బ్రహ్మోత్తరఖండము


సీ.

ఆబాలకునితల్లి యరుదెంచి మమతచే
        భుజియింప రమ్మని పుత్త్రుఁ బిలువ
మునిపోల్కి నున్నయాముద్దులపాపని
        పలుమాఱుఁ జీరినఁ బలుకకున్న
డగ్గర నేతెంచి తాడనంబులుసేయ
        స్థాణువుపగిది నిశ్చలతనుండ
నతినిష్ఠురోక్తుల నదలించి బెదరించి
        కోపంబు దీపింప గోపికయును


తే.

మారుమాటాడకున్న కుమారు దిట్టి
కొట్టి చాలించి యచ్చోటఁ దిట్టమైన
పూజయంతయు జెరిచి దుర్బుద్ధి యగుచు
దూరముగ నశ్మలింగంబుఁ బాఱవైచె.

208


క.

కొంతవడికి నాబాలకుఁ
డెంతయుఁ గనుదెఱచి చూచి యిది యేమియొకో
వింత యటంచును మదిలోఁ
జింతింపుచు రోదనంబు సేయఁ దొడంగెన్.

209


వ.

ఇవ్విధంబున నాగోపబాలకుండు కొంతప్రొద్దునకు విగత
శోకుం డై యిక్కార్యంబు మదీయజననీకృతంబు గావ
లయు నని మనంబున నిశ్చయించి తద్దోషపరిహారార్థంబుగా
నప్పరమేశ్వరుని ధ్యానం బొనరింపుచు నిట్లని స్తుతియించె.

210


క.

పరమేశ్వర శివశంకర
కరుణాకర నీలకంఠ గజచర్మధరా
గిరిపుత్త్రికామనోహర
పురహర ననుఁ బ్రోవు మఖిలభూతశరణ్యా.

211