పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/96

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

89


నావల్లవాంగన కాత్మసంభవుఁ డైన
          బాలకుం డారాజు భవునిపూజ
సేయ యథాక్రమస్థితులు దప్పక యుండ
          భావించి చూచి యేర్పడ గ్రహించి
తనకుటీరంబుముందట నుండు నొకశూన్య
          దేశంబునందు శుద్ధిగ నొనర్చి


తే.

యచటిశిలఁ దెచ్చి శివలింగ మనుచు భక్తి
యమర గృత్రిమగంథాక్షతములు పత్ర
పుష్పఫలములు నైవేద్యములు నొసంగి
చిత్త మలరంగ శివపూజ సేయుచుండె.

205


తోటకము.

నగపతిముందట నాట్యముఁ ద్రొక్కున్
గగనశిరోజుని గానము సేయున్
భగవంతునిపదభజన మొనర్చున్
జగదీశ్వరుసంస్తవముఁ బఠించున్.

206


వ.

ఇవ్విధంబున నాగోపబాలకుండు బాలక్రీడావినోదంబున
నానృపాలుం డాచరించువిధంబున దానును శివార్చనంబు
సేయుదు నని సంకల్పించి యాకృతలింగంబునకు షోడశో
పచారవిధులును నమస్కారంబులుం జేయుచు గొంతప్రొద్దు
గడపి భోజనవాంఛానిరతుండయి నిశ్చలభావంబునఁ బర
మేశ్వరథ్యానంబు సేయుచు నిమీలితలోచనుండును
బద్ధాంజలిపుటుండును ననన్యమనస్కుండు నగుచు సమాధి
నిష్ఠాతిశయంబున స్థాణురూపంబున నుండునంత.

207