పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/92

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

85


పట్టణమున కని సేనల
దిట్టముగాఁ బనిచి రపుడు ధీరోద్ధతులై.

190


క.

అత్తఱి నాజనపతి యీ
వృత్తాంతము విని పురంబువెలుపల బరభూ
భృత్తులు చేరుట కెంతయు
జిత్తంబున భయము దోఁపఁ జింతిలుచుండెన్.

191


ఉ.

ఈనరనాథయాధపు లనేకులు వీరలతోడ సంగరం
బే నొనరింపఁజాలఁ బరమేశ్వరుఁడే యిఁక నాకు ది క్కటం
చానగరంబువాఁకిట మహారథుల న్నియమించి యంతటన్
సూనశరారికిన్ శరణుజొచ్చె దృఢీకృతచిత్తవృత్తియై.

192


చ.

కమలభవుండు సారథిగఁ గర్బురశైలము కార్ముకంబుగా
క్షమ యరదంబుగాఁ ధరణిచంద్రులు చక్రయుగంబుఁ గాఁగ వే
దములు తురంగమంబులుగ దానవవైరి శరంబుఁగా భుజం
గమపతి మౌర్విగాఁ దగుమృగాంకధరుం ద్రిపురారి గొల్చెదన్.

193


వ.

అని నిశ్చయించి.

194


క.

శూలాయుధుఁ డైనమహా
కాళేశ్వరుగుడికిఁ జేరి ఘనమతి నభిషే
కాలంకారక్రియలను
మాలూరదళార్చనము లమర్చను భక్తిన్.

195


చ.

మఱియు సుగంధధూపములు మానితగోఘృతదీపమాలికల్
సురుచిరభక్ష్యభోజ్యములు చోష్యఫలాద్యమృతోపహారము
ల్నిరుపమమంత్రపుష్పము లనేకములైనప్రదక్షిణంబులున్
గురుతరవందనంబులును గోరి యొనర్చెను జంద్రమౌళికిన్.

196