పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/86

ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

79


యశ్వమేధాదియాగంబు లాచరించి
బ్రాహ్మణుల కిత్తు విత్త మపారముగను.

159


వ.

ఇవ్విధంబున సకలప్రజానురంజనంబుగా బహువర్షంబులు
రాజ్యంబుఁ బాలించి యనంతరంబున నిజనందనునకుఁ
బట్టంబు గట్టి తపోవనంబునకుం జని యచ్చట నగస్త్యమహా
మునిం గాంచి వినయంబునం బ్రణమిల్లి యమ్మహాత్మునివలన
నాత్మవిజ్ఞానంబు వడసి కొంతకాలంబునకు దేహంబులు
విడిచి పునరావృత్తిరహితంబైన శివలోకంబున శివసాయు
జ్యంబు నొంది యుండుదుము అటుమీదట జన్మంబు లేదని
భవిష్యత్కాలవృత్తాంతంబులు చెప్పిన విని యాకుముద్వతి
మహాశ్చర్యంబు నొంది పరమేశ్వరప్రభావం బింత యొప్పునే
యని యగ్గించి నిజవల్లభుం డైనదాశరాజుం బూజించి
యితండు సర్వజ్ఞుం డని తలంచి వెండియు నమ్మానవతి
యి ట్లనియె.

160


క.

శ్వానం బెక్కడ విమల
జ్ఞానంబు వహించి సకలసామ్రాజ్యంబుల్
దానొంది శివపదంబున
నానందముతో వసించు టద్భుత మరయన్.

161


వ.

అని పలికి తదనంతరంబున నాదంపతులు మహాదేవుం డైన
శ్రీవిరూపాక్షు నారాధింపుచు ననేకసంవత్సరంబులు
సౌఖ్యంబు లనుభవించి మఱియు సప్తజన్మంబులు రాజ్యంబు
పాలించి యంత్యంబున శివసాయుజ్యంబు నొంది రని చెప్పి
సూతుం డి ట్లనియె.

162