పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/85

ఈ పుట ఆమోదించబడ్డది

78

బ్రహ్మోత్తరఖండము


సీ.

పద్మాక్షి వినుము సప్తమజన్మమున నేను
         బాండ్యరాజని ధాత్రిఁ బ్రబలుచుందుఁ
బద్మవర్ణాభిఖ్యఁ బరఁగి దానక్షాత్ర
         సాహసదైర్యాదిసద్గుణములఁ
బద్మమిత్రప్రభ భాసిల్లుచుండుదు
         వైదర్భివై నీవు వన్నె కెక్కి
వసుమతి యనుపేర వర్ధిల్లి భోగసౌం
         దర్యాతిశయములఁ దనరుచుందు


తే.

వంత సకలార్థవిదులు దేశాధిపతులు
వచ్చియుందురు నీస్వయంవరమునకును
జెలువుమీఱంగ దమయంతి నలునిమాడ్కి
నను వరింతువు రాజనందనుల విడిచి.

156


మహాస్రగ్ధర.

అంతన్ గాంధారసాళ్వాద్యఖిలనృపతులున్ హైహయుల్ మాగధాంధ్రుల్
కుంతప్రాసాంకుశోద్యద్గురుతరకరులై ఘోరసంగ్రామకాంక్షం
బంతంబు ల్మీఱ భేరీపటుపటహలసద్భాంకృతుల్ మిన్ను ముట్టన్
దంతిప్రాముఖ్యసేనాతతి గొలువ మహోద్దాములై వత్తు రల్కన్.

157


శా.

చండాటోపతఁ జుట్టుముట్టిన పరక్ష్మాపాలురన్ దీప్తకో
దండజ్యాప్రవిముక్తతీవ్రశరసంధానార్తులం జేసి వే
దండస్యందనఘోటకాదుల మహోద్యద్దోర్బలస్ఫూర్తిచే
ఖండీభూతులఁ జేసి తెత్తు నిను ఢక్కారావముల్ మ్రోయఁగన్.

158


తే.

అంత నగరంబునకు వచ్చి హర్ష మెసఁగఁ
బ్రేమ శుభలగ్నమున నిన్నుఁ బెండ్లియాడి