పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/81

ఈ పుట ఆమోదించబడ్డది

74

బ్రహ్మోత్తరఖండము


విలసన్నామసహస్రపాఠరవముల్ వేదధ్వనుల్ వించు నే
నిలువన్ గాంచి మహీసురుల్ కుపితులై నిందించి దండిపఁగన్.

133


క.

అచ్చోటు వాసి చనిచని
యచ్చుగ బలికబళభక్షణాతురమతి నై
వచ్చుచుఁ బోవుచు నుండఁగ
నచ్చటి బాలకులు గొంద ఱత్యుద్ధతు లై.

134


మ.

కరుణాహీనత ఱాలఱువ్వఁగను గైకైశబ్దముల్ సేయుచున్
మరలన్ బాఱుచుఁ గ్రమ్మఱం జనఁగ దుర్మార్గప్రచారుల్ ధను
ర్ధరవీరుల్ ననుఁ గాంచి శాతశరసంధానంబుఁ గావించి భీ
కరలీలన్ బడనేసి రప్పుడు శివాగారప్రదేశంబునన్.

135


వ.

మహేశ్వరనివాసం బైనయప్పుణ్యక్షేత్రంబునఁ గృష్ణచతుర్దశీ
ప్రదోషపుణ్యకాలంబున నిరశనత్వంబు నొంది విరూపాక్షు
సాన్నిధ్యంబున దీపమాలికాలోకనం బాచరింపుచు మృతిఁ
బొందుటంజేసి నికృష్టం బైనశ్వానకళేబరంబు విడిచి దివ్య
దేహంబుఁ దాల్చి విమానరూఢుండ నై కొంతకాలంబు
స్వర్గభోగంబు లనుభవించి క్రమ్మఱ నిషాదదేశంబునకు
రాజనై జన్మించితి యిది నాపూర్వవృత్తాంతంబు నాకుఁ బ్రియ
పత్నివి గావున నీరహస్యంబు నీకుఁ దెలియ ననుగ్రహించితి.
కుముద్వతీ! నీవును నప్పరమేశ్వరు భజియింపు మద్దేవుండు
మహానుభావుండు భక్తవత్సలుండు పరమపురుషుండు భోగ
మోక్షప్రదుండు మృత్యుంజయుండు సర్వభూతదయా
పరుండు నీకు నిహపరసౌఖ్యంబు లొసంగునని చెప్పిన నాశ్చ